కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 6: రాష్ట్ర వ్యాప్తం గా ఉపాధ్యాయల బదిలీలల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వచ్చా యి. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కొత్త అప్లికేషన్లు 203రాగా, ఇది వరకు దరఖాస్తు చేసుకున్న 1,712 మంది తమ దరఖాస్తులను ఎడిట్ చేస్తున్నారు. అలాగే, గతంలో ఆన్లైన్ చేసున్న 62మంది తమ దరఖాస్తులను అలాగే ఉంచుకోగా, మొత్తం కరీంనగర్ జిల్లాలో 1,977దరఖాస్తులు వచ్చాయి. జగిత్యాల జిల్లా లో 231 కొత్త అప్లికేషన్లు రాగా,ఇది వరకు దరఖాస్తు చేసుకున్న 2299 మంది తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకున్నారు.
గతంలో ఆన్లైన్ చేసున్న 71మంది తమ దరఖాస్తులను అలానే ఉంచుకోగా, మొత్తం 2,601 దరఖాస్తులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో 153 కొత్త అప్లికేషన్లు రాగా, ఇది వరకు దరఖాస్తు చేసుకున్న 1,440 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకున్నారు. గతంలో ఆన్లైన్ చేసున్న 87 మంది తమ దరఖాస్తులను అలానే ఉంచుకోగా మొత్తం జిల్లాలో 1680 దరఖాస్తులు వచ్చాయి. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త అప్లికేషన్లు 118 రాగా, ఇది వరకు దరఖాస్తు చేసుకున్న 1388 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకున్నారు. అలాగే, గతంలో ఆన్లైన్ చేసున్న 32మంది తమ దరఖాస్తులను అలానే ఉంచుకోగా మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1538 దరఖాస్తులు వచ్చాయి.
ఆన్లైన్ ద్వారా ఆైప్లె చేసుకున్న ఉపాధ్యాయు లు ఆ దరఖాస్తులను గురు, శుక్ర వారాల్లో డీఈ వో కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుం ది. అందుకోసం కార్యాలయంలో ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వా త, దరఖాస్తు చేసుకున్న వారిపేర్లను అధికారు లు 8, 9 తేదీల్లో డిస్ప్లే చేయనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఆ దరఖాస్తులపై అభ్యంరాలను స్వీకరించనున్నారు.