కొత్తపల్లిలో ఘోరం జరిగింది. అప్పటిదాకా సరదాగా మాట్లాడుకుంటూ బైక్పై వస్తున్న ముగ్గురు స్నేహితులకు అదే చివరి ప్రయాణమైంది. మరికాసేపట్లో ఇల్లు చేరుతామనుకుంటుండగానే రాంగ్రూట్లో అతివేగంగా వచ్చి ఢీకొట్టిన ట్రాక్టర్, ముగ్గురిని బలితీసుకున్నది. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి మానేరు బ్రిడ్జి సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘటనలో రామంచలో నివాసం ఉండే శివరాత్రి ఆంజనేయులు(22), శివరాత్రి సంపత్(19), గుడిపల్లి అరవింద్(19) మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురివీ పేద కుటుంబాలే కావడం, చేతికందివచ్చిన కొడుకులు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులకు తీరని శోకమే మిగిలింది.
– తిమ్మాపూర్/చిగురుమామిడి, జూలై 4
తిమ్మాపూర్/చిగురుమామిడి, జూలై 4: వారు ముగ్గురు మిత్రులు. ఒకే గ్రామం. పేద కుటుంబాలు కావడంతో గ్రామంలో దొరికిన పనులల్లా చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు. కానీ, విధి పగబట్టింది. ఓ పని నిమిత్తం బైక్పై వెళ్లొస్తున్న వారిని కొత్తపల్లి వద్ద రాంగ్రూట్లో వచ్చి ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలిచివేసింది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండ లం రామంచకు చెందిన శివరాత్రి ఆంజనేయులు (22) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతని స్నేహితులైన అదే గ్రామానికి చెందిన శివరాత్రి సంపత్ (19), బొడిపల్లి అరవింద్(19) ముగ్గురు కలిసి సోమవారం సా యంత్రం ఓ పని నిమిత్తం ఒకే బైక్పై గన్నేరువరం మండలం గుండ్లపల్లికి వెళ్లారు. పనులు ముగించుకుని రాత్రి 10.30 గంటలకు తిరిగి రామంచకు వస్తున్నారు.
ఈ క్రమంలో కొత్తపల్లి మానేరు బ్రిడ్జి సమీపానికి చేరుకోగానే, ఓ ట్రాక్టర్ రాంగ్రూట్లో అతివేగంగా వచ్చి వీరి బైక్ను ఢీ కొ ట్టింది. దీంతో ముగ్గురు కిందపడి తీవ్రగాయాలపాలయ్యారు. గమనించిన స్థానికులు పోలీసుల కు, కుటుంబ సభ్యులకు, అంబులెన్సులకు సమాచారం అందించారు. బొడిపల్లి అరవింద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, శివరాత్రి సంపత్, ఆంజనేయులను అంబులెన్సుల్లో కరీంనగర్ దవాఖానకు తరలించారు. మార్గం మధ్యలోనే ఆంజనేయులు మృతి చెందగా, సంపత్ చికిత్స పొందు తూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందగా, రామంచ కన్నీరు పెట్టింది. ప్రమాద స్థలితోపాటూ కరీంనగర్ దవాఖానకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. యువకుల బంధువులు, గ్రామస్తులతో దవాఖాన ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. కాగా, దవాఖాన వద్ద, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐతోపాటు ఎస్ఐలు ప్రమోద్రెడ్డి, రాజేష్ బందోబస్తు నిర్వహించారు. కాగా, ట్రాక్టర్డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని శివరాత్రి ఆంజనేయులు తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్రెడ్డి తెలిపారు.
రామంచలో విషాదం
ముగ్గురు యువకుల మృతితో రామంచ కన్నీరు పెట్టింది. ప్రమాద స్థలితోపాటూ కరీంనగర్ దవాఖానకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. యువకుల బంధువులు, గ్రామస్తులతో దవాఖాన ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. కాగా, దవాఖాన వద్ద, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐతో పాటూ ఎస్ఐలు ప్రమోద్రెడ్డి, రాజేష్ బందోబస్తు నిర్వహించారు. కాగా, ట్రాక్టర్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని శివరాత్రి ఆంజనేయులు తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్రెడ్డి తెలిపారు.
ప్రముఖుల నివాళి
యువకుల మృతి విషయం తెలిసిన వెంటనే హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ దవాఖాన వర్గాలతో మాట్లాడారు. పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే పోస్టుమార్టం చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే జడ్పీటీసీ గీకురు రవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, నాయకులు, ఉప సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, గుంటి తిరుపతి, మాజీ సర్పంచ్ పేర్యాల తిరుపతిరావు, సిద్ధంకి రాజమల్లు, గీట్ల తిరుపతి రెడ్డి, దొబ్బల బాబు, ములిపాల తిరుపతి,సతీశ్, బాబు తదితరులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఒక్కొక్కరిది ఒక్కో గాథ
చదువులు మానేసి కుటుంబాలకు అండగా ఉంటున్న యువకులది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. శివరాత్రి మల్లయ్య, లక్ష్మీలకు ముగ్గురు కొడుకులు. మృతి చెందిన ఆంజనేయులు పెద్దవాడు. ఇప్పటికే పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి వచ్చాడు. మరో 20 రోజుల్లో దుబాయ్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఖాళీగా ఉండలేక సొంత ట్రాక్టర్ నడుపుతూ జీవిస్తున్నాడు. దుబాయ్ వెళ్లి ఉన్న అప్పులు తీరుస్తాడని కొడుకు ఆంజనేయులు కండ్ల ముందే శవమై కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
గుడిపల్లి అరవింద్ది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు శైలజ రాజు కూలీపని చేస్తేనే ఇల్లు గడుస్తుంది. ఈ క్రమంలో అరవింద్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. అరవింద్కు ఒక అన్న, చెల్లె ఉంది. కొడుకు మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.
శివరాత్రి మహేందర్ రేణుక దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సంపత్. ఇతను కూడా డ్రైవర్గా పని చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఇతనికి ఒక చెల్లి శ్యామల ఉంది. కొడుకు మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బయటికి వెళ్లి ఇప్పుడే వస్తానని చెప్పాడని, వెళ్లకపోతే బతికి ఉండేవాడని చెల్లి శ్యామల రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.