పచ్చదనం.. పరిశుభ్రతకు నడుంబిగించిన రాష్ట్ర సర్కారు, పర్యావరణ పరిరక్షణకు సంకల్పించింది. మానవ మలమూత్రాలను శుద్ధి చేసి, నీటిని మొక్కలకు, ఘనవ్యర్థాలను ఎరువుగా తయారు చేసే పనిని మొదలు పెట్టింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాల్లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)ను ఏర్పాటు చేస్తుండగా, రామగుండం నగరంలోని మల్కాపూర్ శివారులో పట్టణ ప్రగతి నిధులు 3.80కోట్లతో అందుబాటులోకి తెచ్చింది. 1.23ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్లాంట్ ఇటీవలే మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభమైంది. రోజువారీగా మున్సిపల్ ప్రత్యేక వాహనాల ద్వారా ఇండ్ల నుంచి వ్యర్థాలను సేకరించడమే కాదు, సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ నిర్వాహకుల నుంచీ తీసుకోనున్నారు. ఇటు వ్యర్థాల శుద్ధి.. అటు ఎరువుల వృద్ధితో బహుళ ప్రయోజనాలు కలుగనుండగా, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – పెద్దపల్లి, మే 14 (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, మే 14 (నమస్తే తెలంగాణ) : స్వచ్ఛ తెలంగాణలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం బాగా పెరిగింది. అయితే ఇక సెప్టిక్ ట్యాంకులు నిండితే ప్రైవేట్ ట్యాంకర్లు వచ్చి వ్యర్థాలను సేకరించి శివారు ప్రాంతాల్లో పారవేయడం, గుంత తీసి పూడ్చి పెడుతున్నారు. దీంతో వాయు, నీటి, భూ కాలుష్యంతో పర్యావరణానికి విఘా తం కలిగి, వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ క్ర మంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీ కారం చుట్టింది. మున్సిపాలిటీల్లో వ్యర్థాలను శుద్ధి చేసి సేంద్రియ ఎరువుల తయారు చేయాలని నిర్ణ యం తీసుకున్నది. ఈ మేరకు పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)లు నిర్మిస్తున్నది. ఇప్పటికే 17 చోట్ల ఇలాంటి ఎఫ్ఎస్టీపీలు నిర్మించగా, తాజాగా రామగుండంలో అందుబాటులోకి వచ్చింది.
3.80 కోట్లతో నిర్మాణం..
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని మల్కాపూర్ శివారులో 1.23ఎకరాల స్థలంలో పట్టణ ప్రగతి నిధులు 3.80కోట్ల వ్యయంతో 4,200మీటర్ల వైశాల్యంలో ఎఫ్ఎస్టీపీని నిర్మించారు. 3,130మీటర్ల వైశాల్యంలో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో పూర్తిగా సోలార్ పద్ధతిలో విద్యుత్ అవసరం లేకుండానే పనిచేసేలా 60కేఎల్డీ (కిలో లీటర్స్ పర్ డే) సామర్థ్యంతో నిర్మించారు. ఇందులో 60 కేఎల్డీ తీసుకువచ్చి రీసైక్లింగ్ చేస్తే 55 కేఎల్డీల నీళ్లు బయటికి వస్తాయి. ఇంకా రెండు టన్నుల స్లడ్జ్ బయటికి వస్తుంది. నీటిని మొక్కలకు, స్లడ్జ్ను ఎరువుగా తయారు చేసి మొక్కలకు వినియోగించనున్నారు. కాగా, ప్లాంటు ఆవరణలో ఆహ్లాదం కలిగించేలా పూర్తి పర్యావరణ హితంగా శానిటేష న్ రిసోర్స్ పార్కును ఏర్పాటు చేశారు. సిట్రస్ గార్డెనింగ్ పేరిట పచ్చదనంతో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు.
పనితీరు ఇలా…
రామగుండం నగరంలో 2011జనాభా లెక్కల ప్రకారం 45వేల ఇండ్లు ఉండగా, మొత్తం 2,29,644జనాభా ఉంది. ఇంటింటా మరుగుదొడ్డి ఉండగా, నగరంలోని 50డివిజన్లలో దాదా పు 30వరకు సామూహిక మరుగుదొడ్లు ఉండగా, ఆయా సెప్టిక్ ట్యాంకుల నుంచి మల, మూత్ర వ్యర్థాలను సేకరిస్తారు. ఇలా సేకరించిన వాటిని ఎఫ్ఎస్టీపీ కేంద్రానికి తరలిస్తారు. ప్లాంట్లో వ్యర్థాలను కుమ్మరించిన తర్వాత మల వ్యర్థం, నీరు సపరేట్ అవుతాయి. ప్రత్యేకంగా నిర్మించిన చిన్న చిన్న గదుల ద్వారా వివిధ దశల్లో వడపోత జరుగుతుంది. సేంద్రియ ఎరువు కార్బన్ ఫిల్టర్లోకి, శుద్ధి తర్వాత నీరు ట్యాంకులోకి చేరుతుం ది. ఈక్రమంలో నీరు, ఘన పదార్థాలుగా వేరవుతాయి. ఘన పదార్థాలను శుద్ధి చేసి పొడిగా మా రుస్తారు. దీంతో ఎరువును తయారు చేసి నర్సరీల్లోని మొక్కలకు, పల్లె ప్రకృతివనాలకు, అర్బన్ పార్కులకు, రహదారుల వెంబడి నాటిన మొక్కలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగించనున్నారు. శుద్ధి తర్వాత నీటిని అవే మొక్కల సంరక్షణకు వినియోగించనున్నారు.
ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ అభినందనలు
రామగుండం పర్యటన సందర్భంగా ఈ నెల 8న మంత్రి కేటీఆర్ గాంధీనగర్లో ఎఫ్ఎస్టీపీ పైలాన్ ఆవిష్కరించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన విషయం తెలిసిందే. అయితే రామగుండం నియోకవర్గ ప్రజలకు ఎఫ్ఎస్టీపీ అందుబాటులోకి రావడంతో నగర పాల క సంస్థను, పాలకవర్గాన్ని అభినందిస్తూ .. ప్లాంట్ కు సంబంధించిన మూడు ఫొటోలను ట్యాగ్ చేస్తూ గురువారం ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వచ్ఛ తెలంగాణ మిషన్లో భాగం గా రాష్ట్రంలోని 141 మున్సిపాల్టీల్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా వ్యర్థాలు సేకరిస్తాం
మానవ వ్యర్థాల శుద్ధీకరణ కోసం నిర్మించిన ఎఫ్ఎస్టీపీ సేవలు అం దుబాటులోకి వచ్చాయి. ఈ ప్లాంట్లో రామగుండం నగరంలోని 50డివిజన్ల నుంచే కాకుండా, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో సెఫ్టిక్ ట్యాంక్ వ్యర్థాలను సేకరించే వారి వద్ద నుంచి తీసుకొని ప్లాంట్లో ట్రీట్మెంట్ చేస్తాం. సెఫ్టిక్ ట్యాంక్ క్లీనర్లు ఇక్కడికే వచ్చి మానవ వ్యవర్థాలను ట్రీట్ మెంట్కు ఇవ్వాలి.
– సుమన్రావు, కమిషనర్ (రామగుండం కార్పొరేషన్)
కాలుష్యం పూర్తిగా తగ్గుతుంది..
రామగుండంలో 3.80కోట్లతో నిర్మించుకున్న ఎఫ్ఎస్టీపీని ఇటీవలే ప్రారంభించుకున్నాం. మానవ వ్యర్థాలను బయట పడేస్తుండడం వల్ల చెరువులు, కుంటలు, పంటలు కాలుష్యానికి గురవుతున్నాయి. ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభించుకోవడంతో ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు. ఇప్పటికే సెఫ్టిక్ ట్యాంక్ క్లీనర్లు, స్లడ్జ్ డ్రయ్యింగ్ ఆపరేటర్లకు అవగాహన కల్పించాం. ప్లాంట్ ద్వారా కంపోస్టు ఎరువు తయారు చేసి మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తాం. ప్లాంట్ ఏర్పాటుతో అతి త్వరలోనే స్వచ్ఛతలో రామగుండం మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే నంబర్వన్గా నిలుస్తుందనే నమ్మకం ఉంది.
– బంగి అనిల్కుమార్, మేయర్ (రామగుండం కార్పొరేషన్)