పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు, సరికొత్త నిర్ణయాలతో ముందుకుసాగుతున్నది. ఓ వైపు విద్యాలయాలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతూ.. ఎప్పటికప్పుడు బోధన సౌకర్యాలను మెరుగుపరుస్తూనే, క్రీడాణిముత్యాలను తయారు చేయాలని భావిస్తున్నది. ఈ క్రమంలో విద్యాహక్కు చట్టం అమలుతో మరుగునపడి పోయిన స్కూల్ గేమ్స్కు జీవం పోయాలని నిర్ణయించి, ప్రైమరీ స్కూల్కు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10వేల చొప్పున జగిత్యాల జిల్లాకు రూ.52.75 లక్షలు విడుదల చేసింది. ఇదే సమయంలో స్కూళ్లలో వసతుల కోసం పిల్లల సంఖ్య ఆధారంగా కేటాయింపులు చేయగా, టీచర్లు, విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
– జగిత్యాల, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): సర్కారు బడులకు మహర్దశ పట్టింది. ‘మన ఊరు.. మన బడి’ కింద రూ.వందలాది కోట్లు వెచ్చించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్న సర్కారు, మరో వైపు సాంకేతిక సొబగులు సమకూర్చుతోంది. ప్రతి స్కూళ్లో విద్యార్థులకు డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తూ, ఆధునాతన పద్ధతిలో విద్యాబోధనకు మార్గం సుగమం చేసింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభ మై నెల కూడా గడువక ముందే తా జాగా పాఠశాలల్లో బోధనకు సంబంధించిన మౌ ళిక వసతులు చాక్ పీస్లు, పటాల కొనుగోలుతోపాటు క్రీడా సామగ్రి కొనుగోలుకు జిల్లా వి ద్యాశాఖ అకౌంట్లలో నిధులు జమచేయడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
విద్యాహక్కు చట్టం అమలుతో క్రీడలకు మంగళం..
రాష్ట్రంలో దశాబ్దాలుగా పాఠశాలల్లో క్రీడలు ని ర్వహిస్తూ పిల్లల్లోని నైపుణ్యాన్ని వెలికితీసే ప్ర క్రియ కొనసాగింది. ఇందుకోసం ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి ప్రభుత్వం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్)ను ఏర్పాటు చేసింది. దీని ఆ ధ్వర్యంలోనే మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో క్రీడలు నిర్వహించేవారు. అండర్-14, అండర్-17 స్థాయిల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించి బహమతులు ఇచ్చేవారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడం, శిక్షణ శిబిరాలు ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టేవారు. అయితే కాలగమనంలో ఇవన్నీ కనుమరుగయ్యాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కోసం క్రీడల నిర్వహణకు గత ప్రభుత్వా లు నేరుగా నిధులు మంజూరు చేయలేదు. సం దర్భానుసారంగా మాత్రమే నిధులు ఇస్తూ వచ్చాయి. కానీ నిధులు సమకూర్చుకునేందుకు ఎస్జీఎఫ్లకు అవకాశం కల్పించాయి. ఏటా స్కూల్లో చేరే ప్రతి విద్యార్థి వద్ద నుంచి ఏడాదికి రూ.10 చొప్పున వసూలు చేసేవి. ఇందులో నుంచి రూ.6 ఎస్జీఎఫ్కు పంపించేవి. మిగిలిన రూ.4తో పాఠశాలల్లో క్రీడ సామగ్రి కొనుగోలు, క్రీడల నిర్వహణ కోసం వెచ్చించేవారు. ఈ విధానం దశాబ్దాల పాటు కొనసాగుతూ రాగా, 2013లో అమల్లోకి వచ్చిన విద్యాహక్కు చ ట్టంతో బ్రేక్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల నుంచి ఒక్క రూపాయి కూడా వ సూలు చేయరాదని చట్టం పేర్కొంది. ఫలితంగా ఎస్జీఎఫ్లకు నిధులు లేకుండాపోవడంతో పాఠశాలల్లో క్రీడా సామగ్రి కొనుగోలుకు, క్రీడల నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది.
రాష్ట్ర సర్కారు చేయూత
విద్యాహక్కు చట్టం అమలుతో పాఠశాలల్లో క్రీడలు తగ్గిపోయాయి. ఎస్జీఎఫ్కు నిధులు లే కపోవడంతో ఎలాంటి క్రీడలను నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. పాఠశాలల్లోనూ అదే పరిస్థితి నెలకొన్నది. క్రీడలకు ప్రాధాన్యత తగ్గిపోవడంతో పాఠశాలల పిల్లల్లోను నిరాసక్తత నెలకొంది. కొన్ని స్కూళ్లలో హెచ్ఎంలు, పీఈటీలు, గ్రామస్తులను కలిసి క్రీడలను నిర్వహించే ప్రయత్నం చేసినా ఇది పెద్దగా సత్ఫలితాలను ఇవ్వలేకపోయింది. దీనికి తోడు కరోనా విలయంతో పాఠశాలలు మూతబడి క్రీడలు పూర్తిగా అటకెక్కా యి. క్రీడల ప్రాధాన్యత తెలిసిన రాష్ట్ర సర్కారు ప్రతి పాఠశాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాకు రూ.52.75 లక్షలు
ప్రతి ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, ప్రా థమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10వేల చొప్పున క్రీడా నిధులు మంజూరు చేసింది. ప్ర తి పాఠశాల అకౌంట్లలో డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. జగిత్యాల జిల్లాలో 511 ప్రాథమిక పాఠశాలలకు రూ.25.55 లక్షలు, 85 ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.8,50 లక్షలు, 187 ఉన్నత పాఠశాలలకు రూ.18.70 లక్షలు మంజూరు చేసింది. మొత్తంగా 783 పాఠశాలలకు రూ.52.75 లక్షలు అందించింది.
క్రీడా సామగ్రి కొనుగోలుకు అవకాశం..
క్రీడల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన రా ష్ట్ర సర్కారు, సదరు పాఠశాలల్లో క్రీడా సామగ్రి కొనుగోలుకు అవకాశాన్ని కల్పించింది. ఏఏ క్రీడలకు సంబంధించిన సామగ్రిని కొనుగోలు చే యాలో ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ప్లా స్టిక్, చెక్కతో చేసిన క్రికెట్ బ్యాట్లు, వికెట్లు, సాఫ్ట్బాల్, టెన్నిస్బాల్, ప్లాస్టిక్ బాల్స్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, రగ్బీసాఫ్ట్, బీన్బ్యాగ్స్, సాకర్కోన్, ప్యారాషూట్, షాట్పుట్, డిస్కస్, షోమ్, జావెలిన్ త్రో వంటి క్రీడా పరికరాలు, ఉన్నత పాఠశాలల్లో స్కిప్పింగ్ రోప్స్, త్రోబాల్, ప్రథమ చికిత్స కిట్లు కొనుగోలుకు అవకాశం ఇచ్చింది. అథ్లెటిక్స్కు సంబంధించిన సామగ్రిని సైతం సమకూర్చుకోవాలని సూచించింది.
బోధన అవసరాల కోసం నిధులు..
జిల్లాలో ప్రతి పాఠశాలకు బోధన అవసరాల కోసం విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 30 లోపు సంఖ్య ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉ న్నత పాఠశాలకు ఏడాదికి రూ.10వేల చొప్పున జమ చే సింది. ఇక 31 నుంచి 100 లోపు విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలకు రూ. 25వేలు, 101 నుంచి 250 మంది పిల్లలున్న స్కూళ్లకు రూ.50వేలు, 250 నుంచి వెయ్యి మంది పిల్లలున్న పాఠశాలలకు రూ.75వేలు, వెయ్యి కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయిస్తూ సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల పాఠశాలలతో పాటు, మోడల్ స్కూల్స్, గురుకులాలకు సైతం ఈ నిధులు మం జూరయ్యాయి. జిల్లాలో 511 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత, 187 ఉన్నత, 13 మోడల్ స్కూళ్లకు నిధులను జిల్లా విద్యాశాఖ ఖాతాలో జమచేసింది. జిల్లాలోని పాఠశాలల్లోని వి ద్యార్థుల సంఖ్యను జిల్లా విద్యాశాఖ అధికారులు లెక్కిస్తున్నారు. లెక్క తేలిన తర్వాత పాఠశాలల అకౌంట్లలోకి నిధులను జమ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్కూళ్లకు పూర్వవైభవం వస్తుంది..
రాష్ట్ర సర్కారు నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల కు పూర్వవైభవం వస్తుంది. నిధులతో క్రీడలతో పాటు బోధనకు సైతం మేలు జరుగుతుంది. విద్యార్థి దశలో క్రీడలు అత్యంత కీలకమైనవి. అయితే నిధులు లేకపోవడంతో కొన్నాళ్లుగా స్కూళ్లలో ఆటలు తగ్గిపోయాయి. దీనికి తోడు కరోనా సైతం క్రీడల నిర్వహణపై ప్రభావం చూ పింది. చాలా మంది ఔత్సాహికులు క్రీడల్లో పా ల్గొనకుండానే పాఠశాల విద్యను పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలకు నిధులను కేటాయించడం సంతోషంగా ఉంది. ఈ నిధులతో మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉంది. పీఈటీలు, పీడీలు లేని పాఠశాలల్లో హెచ్ఎంలు చొరవ తీసుకొని, టీచర్లకు క్రీడా బాధ్యతలు అప్పగించాలని సూ చించాం. ప్రతి రోజూ వ్యాయామ ఉపాధ్యాయు లు, సాయంత్రం పాఠశాలల్లో క్రీడల్లో తర్ఫీదు ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బోధనకు కావాల్సిన సౌకర్యాల కు నిధులను మంజూరు గొప్ప విషయం.
– బీ జగన్మోహన్రావు, డీఈవో (జగిత్యాల)