Sarangapur | సారంగాపూర్, ఆగస్టు 25 : ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు వ్యవసాయం చేసినట్లయితేనే నేల ఆరోగ్యం బాగుపడుతుందని రైతుల ఆరోగ్యాలు మెరుగుపడతాయని సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి వి భాస్కర్ అన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మండల వ్యవసాయ అధికారి తిరుపతి ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ సౌజన్యంతో రైతులకు ప్రకృతి వ్యవసాయం, పంటల సమగ్ర సస్యరక్షణపై మంగళవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులు వాడాలని అధిక మోతాదులో ఎరువులు వాడి నేల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయవద్దని రైతులకు సూచించారు.
పలు పంటలలో పరుగుల యొక్క సాంద్రతను తెల్సుకున్న తర్వాతనే జీవ నియంత్రణ పద్ధతులు చేపట్టి తద్వారా పరుగుల, తెగుళ్ల యొక్క ఉధృతిని అరికట్టాలని, దానికి వేప నూనే ట్రైకోడేర్ మై విరిడి సూడోమోనోస్ లాంటి పరుగుల, తెగుళ్ల యొక్క ఉధృతిని తగ్గించుకోవాలని సూచించారు. పలు పథకాలను ఎఫ్ఎఫ్ఎస్ బుకింగ్ యాప్ పైన తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి నీల తిరుపతి, టెక్నికల్ ఏవో శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఎలమట్ల హరీష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు హర్షకోట రాజగోపాల్ రావు, ఆదర్శ రైతు రాములు, కృష్ణరావు, శిరీష, రైతులు తదితరులు పాల్గొన్నారు.