ధర్మారం, ఆగస్టు 29: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే మోడల్గా మారిందని, సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్లలోనే అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. మంగళవారం ధర్మారం మండ లం కొత్తూరు, న్యూ కొత్తపల్లి, చామనపల్లి, ధర్మారం మండల కేంద్రంలో పర్యటించి, రూ.8 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. సమైక్య పాలనలో వెనుకబడ్డ తెలంగాణను సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషి చేసి, అభివృద్ధిలోకి తీసుకువచ్చారని, ఇంతటి అపూర్వ విజయాలు సాధించిన తెలంగాణ వైపు దేశమంతా చూస్తున్నదని స్పష్టం చేశారు. మన సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల్లో అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రణాళికలు వేస్తున్నాయంటే మనం ఎంత ప్రగతి సాధించామో తెలిసిపోతున్నదని చెప్పారు. ముఖ్యంగా అనేక ప్రాజెక్టులు నిర్మించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశామని, కోటికి పైగా ఎకరాలలో పంటలు పండుతున్నాయన్నారు. వరి సాగులో, ధాన్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలో నంబర్వన్గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. సాగుకు 24 గంటల నిరంతర కరెంట్ సరఫరా, నీటి తీరువా రద్దు, పంట పెట్టుబడికి రైతుబంధు సాయం, రైతు మరణిస్తే కుటుంబాలు ఆగం కాకుండా రూ.5 లక్షల బీమా అందిస్తుండడంతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు.
రైతు సంక్షేమం కోసం ఇంతలా కృషి చేసే ప్రభుత్వం దేశంలో ఎకడైనా ఉందా..? చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగు కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కొలువులకు నోటిఫికేషన్లు ఇస్తున్నదని, మరోవైపు మంత్రి కేటీఆర్ రాష్ర్టానికి ఐటీ కంపెనీలు తెస్తూ లక్షలాది మందికి కొలువులు ఇప్పించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. ‘మన ఊరు -మనబడి’కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపు తెచ్చామని, మౌలిక వసతుల కల్పనతో విద్యార్థుల సంఖ్య ఎంతో పెరిగిందని గుర్తు చేశారు. నంది రిజర్వాయర్ దిగువన గ్రామాల్లో వరద నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన డ్రైనేజీ నిర్మాణానికి రూ.3 కోట్ల మంజూరు చేయించినట్లు వివరించారు. ధర్మారం మండల కేంద్రం దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇకడి ప్రజల కోసం నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లైబ్రరీ భవనం, ఫిష్ మారెట్ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే కాలంలో మండల కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చామనపల్లిని పూర్తి ముంపు గ్రామంగా పరిగణిస్తామని, ప్రజలు ఆందోళన చెందవద్దని అభయం ఇచ్చారు.
గ్రామానికి ఆర్అండ్ఆర్ వర్తింపజేసేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామస్తులు తనపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలని, విపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మవద్దని సూచించారు. ప్రజలంతా బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని, మూడోసారి కేసీఆర్ను సీఎం చేయాలని కోరారు. తనను ధర్మపురి నియోజకవర్గ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించి, అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కొత్తూరులో మున్నూరు కాపు సంఘం యువకులు, ఖిలావనపర్తి సర్పంచ్ సాగంటి తార కొండయ్య ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, వడ్డెర, యాదవ సంఘం నాయకులు మంత్రి ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పద్మజ, సర్పంచులు తాళ్ల మల్లేశం గౌడ్, దార మల్లమ్మ, దాసరి తిరుపతి,పూస్కూరు జితేందర్రావు, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు పూస్కూరు రామారావు, డీఎంహెచ్వో ప్రమోద్ కు మార్, ఆర్అండ్బీ డీఈఈ రాములు, తాసిల్దార్ అంబటి రజిత, ఎంఈవో పినుమల్ల ఛాయాదేవి, ఎంపీవో రమేశ్, కొత్తూరు జ డ్పీ హెచ్ఎం మంజుల దేవి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూ రి శ్రీధర్, పార్టీ మండల అధికార ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, ఎంపీటీసీలు సూరమల్ల శ్రీనివాస్, మిట్ట తిరుపతి, కట్ట సరోజ స్వామి, తుమ్మల రాంబాబు, నాయకులు ఉన్నారు.
పెద్దపల్లి నియోజకక వర్గంలోని పలు మండలాలలోని ఆర్అండ్బి రోడ్ల మరమ్మత్తులకు రూ.8కోట్ల 78 లక్షల 58 వేల నిధులు మంజూరైనట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ధర్మారం మండలం కొత్తూరు గ్రామం లో పర్యటనకు వచ్చిన మంత్రి ఈ విషయాన్ని తెలిపారు. ధర్మా రం మండలం కటికెనపల్లి నుంచి పెద్దపల్లి రోడ్డుకు రూ.2.98 కోట్లు, కటికెనపల్లి నుంచి చామనపల్లి రోడ్డుకు రూ.1కోటి 1 లక్ష ల 50 వేలు, రచ్చపల్లి నుంచి ఖిలావనపర్తి రోడ్డుకు రూ.1కోటి 39 లక్షలు, పత్తిపాక వయా పెగడపల్లి మండలం ల్యాగలమర్రి రోడ్డుకు రూ.2కోట్లు లక్షలు, మారేడుపల్లి నుంచి వయా శానబండ నుంచి ముంజంపల్లి వరకు ఆర్అండ్ రోడ్డు మరమ్మత్తుకు రూ.75 లక్షలు నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు.