పెద్దపల్లి, జూన్ 23(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభు త్వం దివ్యాంగులైన ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కన్వీయన్స్ అలవెన్స్ను పెం చు తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి పీఆర్సీ సూచించిన విధంగా 2020 నుంచి సవరించిన పే స్కేలును అమలు చేస్తుండగా, దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ను ప్రస్తుతమున్న రూ.2 వేలను రూ.3 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హర్షం వ్యక్తమవుతున్నది.
వైకల్యం కలిగిన ఉద్యోగులకు ప్రభుత్వం కన్వీయన్స్ అలవెన్స్ ఇవ్వడం గొప్ప నిర్ణయం. పెరుగుతున్న రవాణా చార్జీలకు అనుగుణంగా పరిస్థితులను అర్థం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్.. వైకల్య ఉద్యోగులకు వారి స్కేలును బట్టి రూ.2వేలు, రూ.3వేలుగా హెచ్చించడం మమ్మల్ని ఆనందింపజేసింది. తెలంగాణ సర్కారుకు, ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– కలికోట శ్రీనివాస్, ఎంపీడీఓ ముత్తారం, తెలంగాణ రాష్ట్ర అంధుల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు
తెలంగాణ సర్కారు ప్రతి ఒక్కరి అవసరాలను అక్కెరలను గుర్తించి పాలన కొనసాగిస్తున్నది. వైకల్య నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేస్తున్నది. మాకు ఇచ్చే కన్వీనియన్స్ అలవెన్స్ను పెంచడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు మేమంతా రుణపడి ఉంటాం.
– జీ సత్యనారాయణ, విజువల్లీ చాలెంజ్డ్ ఉద్యోగ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు