కాంగ్రెస్కు అభ్యర్థులు లేరు. బీజేపీకి క్యాడర్ లేదు. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు. వాళ్లకు అధికార యావ తప్ప మరోటి లేదు. బీఆర్ఎస్ది మాత్రం ప్రజా సంక్షేమ తోవ. పనిచేసే ప్రభుత్వాన్ని వదులుకోవద్దు. ధర్మపురి నియోజకవర్గాన్ని 2009 నుంచి ఇప్పటివరకు పచ్చటి పంట పొలంలా కాపాడుకుంటున్నాం. 1500 కోట్లతో అభివృద్ధి చేశాం. మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తా. నాడు బుగ్గారం నియోజకవర్గ కేంద్రంగా ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదు. కానీ, బుగ్గారాన్ని మండల కేంద్రంగా మార్చి ప్రజలకు ప్రభుత్వ పాలనను మరింత దగ్గరకు చేశాం.
– బుగ్గారం ప్రజా ఆశీర్వాదయాత్రలో మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, సెప్టెంబర్ 6 : ‘రాష్ట్రంలో కాంగ్రెస్కు అభ్యర్థులు లేరు. కమలానికి క్యాడర్ లేదు. వాళ్లదంతా మేకపోతు గాంభీర్యమే. వారు చెప్పేది నమ్మితే మోసపోవడం ఖాయం. ఆ రెండు పార్టీలకు అధికార యావ తప్ప మరొక్కటి లేదు. బీఆర్ఎస్ది మాత్రం ప్రజా సంక్షేమ తోవ’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. కానీ, తాము బుగ్గారం గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చి ప్రజలకు ప్రభుత్వ పాలనను మరింత చేరువ చేశామన్నారు. ప్రజా ఆశీర్వాద యా త్రంలో భాగంగా బుధవారం ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలం సిరికొండ, మద్దునూ ర్ ధర్మపురి మండలం రామయ్యపల్లి గ్రామా ల్లో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికి వీర తిలకం దిద్దారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ పాదయాత్రగా గ్రామాల్లో పర్యటించి, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. సిరికొండలో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ధర్మపురి నియోజకవర్గం ఎనలేని అభివృద్ధి సాధించిందని చెప్పారు. ధర్మపురి క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి క్షేత్రానికి వచ్చే భక్తులు ఆశ్చర్యానికి లోనవుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీలు బేజారువుతున్నాయన్నారు. తెలంగాణ లో బీఆర్ఎస్కు తిరుగులేదని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నటికీ వదులుకోరని వివరించారు. బీఆర్ఎస్ను ప్రజలు ఎంతగానో ఆదరిస్తు న్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు కారుగుర్తుపై ఓటేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని, ఇందుకు ప్రజా ఆశీర్వాద యాత్రే నిదర్శనంగా కనిపిస్తున్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ఎన్నికల్లో 63 సీట్లతో, 2018 ఎన్నికల్లో 88 సీట్లలో విజయం సాధించామని, వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 100 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్ర జా ఆశీర్వాదయాత్రలో ప్రజల ఆదరణ చూ స్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు సోషల్ మీడియా, గాందీభవన్, బీజేపీ భవన్లో తప్ప ప్రజల్లో లేవని మండిపడ్డారు. కర్ణాటకలో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ చేతులెత్తేసిందని, ప్రజా సంక్షేమం గురించే ఆలోచించడం లేదని దుయ్యబట్టారు. రైతులు, ప్రజల నుంచి నిత్యం నిరసనలు వ్యక్తమవుతున్నాయని చెప్పా రు.
తెలంగాణలో కాంగ్రెస్కు ఎజెండా అనేదే లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ప్రజల వద్ద కు ఎలా వెళ్లాలో ఆ పార్టీకి ఏం అర్థం కావడం లేదని, విద్యార్థులు, యువకులు ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్నారని, మహిళలు కల్యాణలక్ష్మి, కేసీఆర్కిట్, న్యూట్రిషియన్ కిట్, అమ్మఒడి వాహనాలు, పింఛన్లు, రైతుబంధు, రైతుభీమా, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు ఇలా అనేక సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారన్నారు. కులసంఘాలను సంప్రదించాలనుకుంటే అన్ని కులాలు దళితబంధు, బీసీ బం ధుతో పాటు సంఘ భవనాలు, విద్య, ఉద్యోగాలు, వ్యవసాయం పనులు చేసుకుంటూ ఆనందోత్సహాలతో ఉన్నారన్నారు. ఓట్ల కోసం ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక కాంగ్రెస్, బీజేపీలు సతమతమవుతున్నాయని ఎద్దేవా చేశా రు. ఆ రెండు పార్టీలు కేసీఆర్ను తిట్టడంలో బీజీ అయితే, రాష్ర్టాన్ని నంబర్వన్గా నిలిపే ప నిలో సీఎం కేసీఆర్ బీజీగా ఉన్నారని, వారికి మనకు ఉన్న తేడా అదేనని చురకలంటించా రు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వ్య వసాయానికి 24గంటల కరెంటు ఇస్తున్నామనీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కేవలం ౩గంటలు మాత్రమే ఇస్తున్నారన్నారు. నాలుగు లక్షల ఎకరాల్లో గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి రైతుభీమాను అమలు చేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు. అనంతరం సిరకొండ, మద్దునూర్ గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు 80 మంది మ్ంర తి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమాల్లో డీసీఎమ్మెస్ చైర్మ న్ శ్రీకాంత్రెడ్డి, ధర్మపురి ఎంపీప చిట్టిబాబు, జడ్పీటీసీ అరుణ, ఏఎంసీ చైర్మన్ రాజేశ్కుమార్,ఎంపీపీ బాధినేని రాజమణి, జడ్పీటీసీ బాదినేని రాజేందర్, వైస్ ఎంపీపీ సుచేందర్,ఆర్బీఎస్ కన్వీనర్ సత్యనారాయణరావ్, మండల బీఆర్ఎస్ అధ్యక్షు డు మహేశ్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యు డు రహమాన్, సర్పంచులు ఉన్నారు.