రామడుగు, మార్చి16: వివాహిత హత్య కేసు మిస్టరీ వీడింది. రెండు రోజుల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. అవసరం కోసం అడిగి న నగదు ఇవ్వలేదని వరుసకు అత్తయిన ఓ వి వాహితను హతమార్చినట్లు తేల్చారు. రామడుగు పోలీస్స్టేషన్లో గురువారం రూరల్ ఏసీ పీ కరుణాకర్రావు వివరాలు వెల్లడించారు. దేశరాజ్పల్లికి చెందిన మామిడిపెల్లి అనిత(58) ఈ నెల 13న హత్యకు గురైంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అనుమానితుడైన ఇదే మండలానికి చెందిన తిర్మలాపూర్కు తడగొండ దామోదర్(34)పై పోలీసులు దృష్టిసారించారు. దామోదర్ జల్సాలకు అలవాటు పడి జులాయిగా తిరుగుతూ కరీంనగర్లోని కిసాన్నగర్లో ఉంటున్నాడు. వరుసకు అత్త మ్మ అయిన అనితను అవసరం కోసం రూ.30 వేలు ఇవ్వాలని దామోదర్ అడుగగా అనిత దా టవేస్తూ వచ్చింది.
ఈ నెల 13న ఇం టికి రావాలని అనిత దామోదర్కు చెప్పింది. అతడు బైక్పై సుభాష్నగర్కు చెందిన మరో స్నేహితు డు జంభోజి శివతో కలిసి బయల్దేరాడు. కాగా అనితనుంచి ఎలాగైనా డబ్బులు తీసుకోవాలని, లేదంటే అమె ను చంపి మెడలోని బంగారాన్ని ఎత్తుకెళ్దామని పథకం పన్నారు. దేశరాజ్పల్లిలోని అనిత ఇంటికి వచ్చి రూ. 30 వేలు అడిగారు. ఆమె నిరాకరించింది. దీంతో అనితను మంచంపై పడేసిన దామోదర్ గొంతు పిసుకగా, శివ ఆమె కాళ్లు చేతులు పట్టుకున్నాడు. ఈ క్రమంలో చున్నీని మెడకు బిగించి హతమార్చారు. ఆమె మెడలోని పుస్తెలతాడు, చెవి కమ్మలు, టీవీ పక్కన ఉన్న పర్సులో వెండి పట్టీలు, నల్లపూసల గొలుసు ఎత్తుకెళ్లారు.
ఈ పుస్తెలను గురువారం ఉదయం తెలిసిన స్వర్ణకారుడి వద్ద పెట్టి రూ.20వేలు తీసు కొని, చెరి 10వేల చొప్పున పంచుకున్నారు. దామోదర్ వద్ద వున్న చెవికమ్మను శివ తీసుకున్నాడు. అక్కడి నుంచి నేరుగా నగునూర్లోని ప్రతిమ దవాఖాన పక్కనగల వైన్షాపులో మద్యం తాగి ముగ్దుంపూర్కు వెళ్లారు. అక్కడ కూడా మద్యం తాగారు. శివను అక్కడే వదిలేసిన దామోదర్ గురువారం తన స్వగ్రామం తిర్మలాపూర్కు వెళుతూ గోపాల్రావుపేట శివారులో పోలీసులకు చిక్కా డు. కాగా పోలీసుల విచారణలో దామోదర్ నే రం ఒప్పుకోగా అతడినుంచి 2 తులాల బంగా రు పుస్తెల తాడు, ఒక జత వెండి గొలుసులు, నల్లపూసల తాడు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరిని పట్టుకోగా, మరో నిందితుడు శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా హత్య కేసును ఛేదించిన చొప్పదండి సీఐ గోపతి రవీందర్, రామడుగు, గంగాధర ఎస్ఐలు అంజ య్య, రాజు, హెడ్కానిస్టేబుళ్లు రమేశ్బాబు, బలరాం, రాజయ్య, జీవన్రెడ్డి, కానిస్టేబుల్ వెంకటయ్యను కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ అభినందించారు.