కమాన్చౌరస్తా, ఆగస్టు 18: బహుజనులను ఏకం చేసి, గోల్కోండ ఖిల్లాపై జెండా ఎగురవేసిన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి శ్లాఘించారు. అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కీర్తించారు. సీఎం కేసీఆర్తోనే పాపన్న ఆశయ సాధన సాధ్యమని చె ప్పారు. విగ్రహం ఏర్పాటుకు 50లక్ష లు మం జూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ శివారులోని మానేరు వంతెనపై ఉన్న సర్వా యి పా పన్న గౌడ్ విగ్రహం వద్ద 373వ జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహించారు. మండలి విప్ కౌశిక్రెడ్డి, కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి, మేయర్ వై సునీల్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి పాలకులు తెలంగాణ పోరాట యోధులను విస్మరించారని విమర్శించారు. కానీ, తెలంగాణ సర్కారు మహనీయు ల జయంతి, వర్ధంతిని అధికారంగా నిర్వహిస్తూ సముచిత గౌరవం ఇస్తున్నదని చెప్పారు.
బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ది అన్నారు. ఆయన పోరాట పటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శం గా తీసుకుని రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. పాపన్న గౌడ్ ఒక గౌడకులానికే కాకుండా, బీసీ సామాజిక వర్గానికి అన్ని కులాలను ఆదరించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పెత్తందారులను తరిమికొట్టిన చరిత్ర అయనదని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు సల్ల శా రదారవీందర్, ఐలేందర్ యాదవ్, గుగిళ్ల జయశ్రీ శ్రీనివాస్గౌడ్, తోట రాములు, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, గోప జిల్లా అధ్యక్షుడు అమరగోని నర్సయ్య గౌడ్, గోప కార్యదర్శి జక్కని మల్లేశం గౌడ్, గౌడ సంఘం రా ష్ట్ర నాయకులు కలర్ సత్తన్న, దూలం సంపత్ గౌ డ్, తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, కనుకయ్య గౌడ్, జక్కని వీరస్వామి గౌడ్, తాల్లపల్లి ఎల్లాగౌడ్, గణపతి గౌడ్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.