రామగిరి, ఫిబ్రవరి 25: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరుగనున్న రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండర్-14 క్రికెట్ పోటీలకు ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు బయల్దేరి వెళ్లిందని ఎస్జీఎఫ్టీఎస్ సెక్రటరీ డాక్టర్ కే.రాంరెడ్డి, జిల్లా సెక్రెటరీ కొమురోజు శ్రీనివాస్ తెలిపారు. 67వ ఎస్జీఎఫ్టీఎస్ క్రికెట్ పోటీలు ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్నాయి.
కాగా, ఈ జట్టులో పెద్దపల్లి జిల్లా నుంచి పల్లె సాక్షితరావు (కెప్టెన్), ఎస్కే సాధిక్ (వైస్ కెప్టెన్), ఎండీ తాజొద్దీన్, ఆర్.చిరు వెంకట ప్రసాద్, కౌశిక్, అశ్రిత్, రక్షిత్, కరీంనగర్ నుంచి అఫ్రిద్, సిద్ధార్థ, అచ్యుతనాథ్, ఆనంద్శాస్త్రి, సిరిసిల్ల నుంచి శివనాగ్, చరణ్తేజ్, నవదీప్, ఈశ్వర ప్రసాద్, మణికంఠ, జగిత్యాల నుంచి రాహుల్, ఉన్నత్ శౌర్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కోచ్ అండ్ మేనేజర్గా సాయినాథ్ పటేల్ కూడా వీరి వెంట వెళ్లారు.