రాంనగర్, జూన్ 12 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2 కే రన్కు విశేష స్పందన లభించింది. కలెక్టర్ కర్ణన్తో కలిసి పోలీసు కమిషనర్ సుబ్బారాయుడు జెండా ఊపి రన్ను ప్రారంభించారు. అంబేద్కర్ స్టేడియం నుంచి ప్రారంభమైన పరుగు తిరుమలనగర్ చౌరస్తా, భగత్నగర్, కలెక్టరేట్, మల్టీఫ్లెక్స్ మీదుగా పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నది. క్రీడా జ్యోతిని చేతబూనిన అధికారులు, వివిధ వి భాగాలకు చెందిన ప్రతినిధులు ఈరన్లో పాల్గొన్నారు. పోలీస్శాఖలోని వివిధ విభాగాలకు చెం దిన పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు దాదాపు వెయ్యి మంది భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధిలో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నదన్నారు.
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో జరిగిన సురక్షా దినోత్సవం కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయన్నారు. సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, ఉత్సవ కార్యక్రమాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమవంతు సహకారం అం దిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ అనిల్కుమార్, అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్లాల్, డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్, భీంరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, అగ్నిమాపక అధికారి వెంకన్న, డీవైఎస్వో రాజవీరు, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయ్కుమార్, మదన్లాల్, విజయసారథి, కాశయ్య, సత్యనారాయ ణ, శ్రీనివాస్, ప్రతాప్, ఎస్బీఐ వెంకటేశ్వర్లు, సం తోష్కుమార్, పారా ఒలింపిక్స్ క్రీడాకారులు అం జనారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, టీఎన్జీవో ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.