పెద్దపల్లి రూరల్, మే 6: ‘మా సొంతూరిలో చెట్టుకింద స్వయంభూ శివలింగం ఉన్నది. గుడి కడితే బాగుంటదని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన. అడిగిన వెంటనే ఆయన దేవాదాయశాఖ అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు’ అని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా గుర్తు చేశారు. నిధులిచ్చిన మహానుభావుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. పెద్దపల్లి మండలం రాగినేడులో ఈ నెల 10వ తేదీ నుంచి 12వరకు శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య శ్రీ విద్యాశంకర భారతి స్వామి ఆధ్వర్యంలో నాగలింగేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
శనివారం ఉత్సవాల ఏర్పాట్లను అధికారులు, అర్చకులతో కలిసి పరిశీలించారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. యాదా ద్రి ఆలయ పునర్మిర్మాణం, కొండగట్టుకు నిధులిచ్చిన తరహాలోనే రామలింగేశ్వరస్వామి ఆలయానికి నిధులిచ్చిన ఆయనకు రుణపడి ఉంటామని చెప్పారు. నాగలింగేశ్వరస్వామి వారి శివలింగం తో పాటు పార్వతీమాత, శ్రీ మహావిష్ణువు, మహాగణపతి, సూర్యభగవానుడు, ఆంజనేయ స్వా మి, మహానంది, నవగ్రహాలు, నాగదేవత, ద్వారా పా లకులు, షిర్డీ సాయిబాబాకు ప్రత్యేక ఆలయాలు ని ర్మించినట్లు తెలిపారు. 10న ఉదయం 8.30 గంటలకు గోపూజ, గురువందనం, గణపతి పూజతో ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
11న హోమాలు, జలాధివాస ఉత్థాపన, శయ్యాదివాసం తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. 12న దేవాలయ ప్రతిష్ఠకు ముఖ్య అతిథులుగా మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, మండలి చీఫ్ విప్ టీ భానుప్రసాద్ రావు, జడ్పీ చైర్మన్ పుట్టమధూకర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రా మగుండం సీపీ హాజరవుతారని తెలిపారు. పెద్దపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు తరలివచ్చి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్క రేవతీకుమార స్వామి, నాయకులు కోలేటి శ్రీనివాస్, పడాల తిరుపతి, బుర్ర అంజయ్యగౌడ్, కట్ల కనుకయ్య, కాదాసి లింగయ్య, పోతు రాజుల భూమయ్య, పోతు రాజుల లక్ష్మయ్య, శంకరయ్య, లింగయ్య, జగన్నాథం పాల్గొన్నారు.