ఉత్కంఠగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
క్వార్టర్, సెమీ, ఫైనల్ మ్యాచ్లకు రంగం సిద్ధం
అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
మంగళవారంతో ముగుస్తున్న టోర్నమెంట్
ఆతిథ్యాన్ని చూసి సంబురపడుతున్న ఆటగాళ్లు
మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు
రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతలు ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్నది. సిరిసిల్లలోని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాళాల వేదికగా రెండ్రోజులుగా జూనియర్ బాల, బాలికల టోర్నమెంట్ హోరాహోరీగా జరుగుతుండగా, నేడు క్వార్టర్, సెమీ, ఫైనల్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీకి ఉమ్మడి 10 జిల్లాల నుంచి 68 జట్లు రావడం.. నేటితో టోర్నమెంట్ ముగుస్తుండడంతో ఆతిథ్యాన్ని చూసి క్రీడాకారులు సంబురపడుతున్నారు. మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 11 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాళాల మైదానం వేదికగా ఈ నెల 9 నుంచి నిర్వహిస్తున్న 48వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల, బాలికల కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చిన 68జట్లు విజయమే లక్ష్యంగా చెమటోడుస్తున్నాయి. నేడు క్వార్టర్, సెమీ, ఫైనల్ మ్యాచ్లు నిర్వహిస్తుండగా, విజేతలు ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్నది.
ఆతిథ్యానికి ఫిదా..
టోర్నమెంట్కు దాదాపు 500 మంది క్రీడాకారు లు తరలిరాగా, జిల్లా కబడ్డీ అసోసియేషన్, జిల్లా పోలీస్శాఖ సంయుక్త నిర్వహణలో ఇచ్చిన ఆతిథ్యానికి ఫుల్ ఫిదా అవుతున్నారు. టైంకు టీ, టిఫిన్, భోజనం అందిస్తుండడం, ఇంకా మైదానంలో భారీ లైటింగ్, ప్రత్యేక కోర్టులు, సౌండ్సిస్టంతోపాటు సకల వసతులు కల్పించడంతో ము రిసిపోతున్నారు. ఇలాంటి సౌకర్యాలు ఎక్కడా చూడలేదని పేర్కొంటూ రెట్టింపైన ఉత్సాహంతో ఆడుతున్నారు.
నేడు క్వార్టర్, సెమీ, ఫైనల్ మ్యాచ్లు..
కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. నేటితో టోర్నీ ముగుస్తున్నది. మంగళవారం క్వార్టర్, సెమీ ఫైనల్, ఫైనల్ పోటీల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సింగారపు తిరుపతి తెలిపారు. అదేవిధంగా విజేత జట్లకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఇక్కడ రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్, అసోసియేషన్ ప్రతినిధులున్నారు.
ఏర్పాట్లు బాగున్నాయి..
నేను ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి పోటీల్లో చాలా సార్లు పాల్గొన్నా. సిరిసిల్లలో క్రీడాకారులకు మంచి సౌకర్యాలు కల్పించారు. నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా బాలికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో వసతి సౌకర్యం కల్పించారు. సమయానికి అల్పాహారం, భోజనం అందిస్తున్నారు.
– ధనూష, ఆల్రౌండర్, కరీంనగర్ జట్టు కెప్టెన్
వసతులు సూపర్..
ఖమ్మం జిల్లా తరఫున నేషనల్స్లో ఆడా. అనేక చోట్ల కబడ్డీ టోర్నమెంట్లకు వెళ్లా. కానీ ఇలాంటి వసతులను మేం ఎక్కడా చూడలే. జిల్లా కబడ్డీ అసోసియేషన్ నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. మంచి భోజనం పెడుతున్నారు. క్రీడా మైదానంలో కోర్టు, సూపర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, పోలీసు సిబ్బంది మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
– కే భవాని, ఖమ్మం జట్టు కెప్టెన్
ఇండియన్ టీం కెప్టెన్సీ టార్గెట్..
సిరిసిల్ల వేదికగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం సంతో షంగా ఉంది. ఇక్కడ క్రీడాకారుల కోసం మంచి ఏర్పాట్లు చేశారు. నేను ఇప్పటివర కు జూనియర్ నేషనల్స్, ఓయూ సౌత్జోన్ పోటీల్లో పాల్గొన్నా. కానీ ఇలాంటి సౌకర్యాలు ఎక్కడా లేవు ఫైనల్లో విజేతగా నిలుస్తామని ఆశిస్తున్నాం.
– సయ్యద్ ఆయేషా, హైదరాబాద్ జట్టు కెప్టెన్
మంచి సౌకర్యాలున్నాయి..
జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా క్రీడాకారుల కోసం అన్ని వసతులు కల్పించారు. ఉదయం నుంచి రాత్రి మ్యాచ్ పూర్తయ్యే దాకా అవసరమైన ఏర్పాట్లను పక్కాగా పర్యవేక్షిస్తున్నారు. సమయానికి టీ, టిఫిన్, భోజనం అందిస్తున్నారు. వసతి భవనంలోనూ అన్ని ఏర్పాట్లు చేశారు.
– సంతోష్, ఆల్రౌండర్, సూర్యాపేట జిల్లా జట్టు
కేటీఆర్ సార్ ఇలాకా బాగుంది..
జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేటీఆర్ సార్ నియోజకవర్గంలో ఆడడం ఆనందంగా ఉంది. నిర్వాహకులు నాణ్యమైన అల్పాహారం, సమయానికి భోజనం పెడుతున్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు కల్పించడంలో అసోసియేషన్ రాజీపడలేదు.
– భూపతిరెడ్డి, హైదరాబాద్ జట్టు కోచ్