పెద్దపల్లి, జూన్ 2 (నమస్తే తెలంగాణ) :తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి కేసీఆర్ చేసిన అలుపెరగని పోరాటం, అమరుల త్యాగాలతోనే స్వరాష్ట్ర కల సాధ్యమైందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మంగళవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా జిల్లాలో అంబరాన్నంటగా, బీఆర్ఎస్ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అన్ని చోట్లా తెలంగాణ అమరులకు నివాళులర్పించి, వారి త్యాగాలను నెమరేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమనేతగా కేసీఆర్ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలిపిన తీరును ప్రశంసించారు.
కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే తెలంగాణ ఆగమైందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రా పాలకుల చేతిలో పెట్టేందుకు రేవంత్ సరార్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని కాపాడేందుకు కేసీఆర్ ఆధ్వర్యంలో మరో ప్రజా పోరాటం చేస్తామని, తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిస్తామని ప్రతిజ్ఞ చేశారు.