కులమతాలతో తమకు పట్టింపులు లేవని సకల జనుల సంక్షేమమే ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్, హైదరాబాద్లో 60మందికిపైగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ముదిరాజ్ సంఘం నాయకులు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్నగర్ రూపురేఖలను పూర్తిగా మార్చామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
మహబూబ్నగర్/రూరల్, జూలై 31: కులం,మతంతో పట్టింపులు లేవని అందరి సంక్షేమమే తమ ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో 24వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో ఎంఐఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 500మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ మహబూబ్నగర్ రూపురేఖలను పూర్తిగా మార్చామన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగడం ఖాయమన్నారు. మెడికల్ కాలేజీ, బైపాస్రోడ్డు, కేసీఎర్ ఎకో అర్బన్ పార్కు, మినీ ట్యాంక్ బండ్, శిల్పారామం, ఐటీ పార్కుతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పనలో మహబూబ్నగర్ ఉత్తమస్థానంలో నిలబడడం ఖాయమన్నారు.ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న ప్రతిఒక్కరూ టీఆర్ఎస్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఓట్ల రాజకీయాలు చేసుకుంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ వారికి మిగిలేదని కుళ్లుకుతంత్రాలేని విమర్శించారు.
దివ్యాంగుడు సైతం టీఆర్ఎస్లో చేరేందుకు పార్టీ కార్యాలయానికి చేరుకోగా మంత్రి అతనికి కండువా కప్పి ఆహ్వానించారు. అంతకముందు హైదరాబాద్లోని మంత్రి శ్రీనివాస్గౌడ్ క్యాంపు కార్యాలయంలో మహబూబ్నగర్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ మహబూబ్నగర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ బుర్రన్న, విజయభాస్కర్, రాజుసింగ్, వాహీద్సునీల్కుమార్, రంజిత్సింగ్, సతీశ్, సాగర్ముదిరాజ్తోపాటు మరో 100మందికిపైగా టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, పీఏసీసీఎస్ చైర్మన్ జూపల్లి భాస్కరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కార్యదర్శి వినోద్, నాయకులు కట్టా రవికిషన్రెడ్డి, పాషా, నవకాంత్, షబ్బీర్, సత్యంయాదవ్, జావెద్, సుల్తాన్ ఉన్నారు. క్యాంపు కార్యాలయంలో పూలతొట్టిలోని నిల్వ నీటిని పారబోశారు. దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు ఇండ్ల మధ్య నిల్వ ఉండకుండా సూచుకోవాలన్నారు.
‘పరిణతవాణి’ సంపుటి ఆవిష్కరణ
తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రచురించిన ‘పరిణతవాణి ’9వ సంపుటిని మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. తెలంగాణ సారసత పరిషత్ చైర్మన్ ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 33జిల్లాల చరిత్ర, సంస్కృతి, పురావస్తు కట్టడాలు సాహిత్యం, తెలంగాణ ఉద్యమంలో జిల్లా కృషి, ఆలయాలు, జాతీయ అంశాలపై తెలంగాణ సమగ్ర స్వరూపం పేరుతో తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గ్రంథాలను ప్రచురిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రామచంద్రమూర్తి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నందిని సిధారెడ్డి, శీలా వీర్రాజు, స్వామి, శివశంకర్ పాల్గొన్నారు.
హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం
మహబూబ్నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎక్స్ పో ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత శ్రీ కళాభారతి హస్తకళా వస్త్ర ప్రదర్శనను మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్ నాయకులు పాల్గొన్నారు.