అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నదాతలు అధైర్య పడకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రజాప్రతినిధులు సైతం ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెబుతున్నారు.
ఓదెల, మార్చి 19: పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఓదెల మండలంలో పలు గ్రామాల్లో కు రిసిన అకాల వర్షానికి నేలవాలిన మక్కజొన్న చేన్ల ను ఆదివారం వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓదెల మండలం, శానగొండ, ఇందుర్తి, బాయమ్మపల్లి, గూడెంలో నేలవాలిన మక్క పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి తుది నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ డీఏవో ఆదిరెడ్డి, సర్పంచులు గోవిందుల ఎల్లస్వామి, తెల్సూరి కొమురయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కావటి రాజు, ఏవో నాగార్జున. ఏఈవో సంధ్య ఉన్నారు.