కరీంనగర్ కార్పొరేషన్, మే 29: కరీంనగరాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు తాము అహర్నిశలూ పనిచేస్తున్నామని, భావితరాలకు మంచి సిటీని తయారు చేసి అందిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ సంస్థ సమావేశ మందిరంలో సోమవారం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై కార్పొరేటర్లు, అధికారులతో సమావేశం నిర్వహించి, ఆయన మాట్లాడారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామన్నారు. ఉత్సవాల ను 21 రోజుల పాటు నిర్వహిస్తామని, ఇందులో ప్ర తి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.
తెలంగాణలో ఈ పదేళ్లల్లో సాగిన అభివృద్ధి, సంక్షే మం, దేశానికే ఆదర్శంగా నిలిచిన తీరుపై ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు మున్సిపాలిటీల్లో ఏ చిన్నపాటి అభివృద్ధి పని చేద్దామన్నా నిధులు ఉండేవి కావని, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నిధులు ఇచ్చేవి కావన్నారు. ఏదో అప్పుడప్పుడు మట్టి రోడ్ల నిర్మాణానికి, గుంతలు పూడ్చేందుకు నిధులు మాత్రమే కేటాయించుకునే దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. కానీ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ఇస్తున్న కోట్లాది నిధులతో నగరంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లే దర్శనమిస్తున్నాయని వివరించారు. సమైక్య పాలనలో నిధుల లేమితో కొట్టుమిట్టాడిన మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరు గా నిధులు మంజూరు చేయడంతో పట్టణాల్లో మౌ లిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని చెప్పా రు.
రాజధాని హైదరాబాద్కు వస్తున్న నిధులను సైతం సీఎం కేసీఆర్ రాష్ట్రమంతటా పంచుతున్నారని, అదే సమైక్య పాలనలో అయితే మనకు రూపా యి కూడా ఇవ్వకుండా ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోయేవారని దుయ్యబట్టారు. కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే 347 కోట్లు ఇచ్చారని, వీటితో నగరంలోని అన్ని డివిజన్లలోనూ పెద్ద ఎత్తున్న అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం విడుదలైన 132 కోట్లతో చేపట్టే పనులకు జూన్ నాటికి టెండర్లు పూర్తి చేసుకొని వేగంగా ప్రారంభించాలని ఆదేశించారు. నగర ప్రజలకు జూన్ 17 నుంచి కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతున్నామని, ఇది పూర్తయితే దేశంలోనే పర్యాటక కేంద్రంగా కరీంనగర్ నిలుస్తుందని చెప్పారు.
తమను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా బీఆర్ఎస్ పని చేస్తుందని, పేదలకు అండగా నిలుస్తున్నదని వివరించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు నిర్వహిస్తామని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. తెలంగాణలో ఈ పదేళ్లల్లో సాగిన అభివృద్ధి, సంక్షే మం, దేశానికే ఆదర్శంగా నిలిచిన తీరుపై ప్రజలకు వివరించాలన్నారు. మేయర్ యాదగిరి సునీల్రావు మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు నగర పాలక సంస్థ సంపూర్ణ సహకారం ఉంటుందని, వైభవంగా నిర్వహించుకుందామని వివరించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్లు, నగరపాలక అధికారులు ఉన్నారు.