కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో గల వేంకటేశ్వరస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి, శ్రీలక్ష్మీనారాయణస్వామి కల్యాణం కమనీయంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివాహ వేడుకను తిలకించి పరవశించిపోయారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్-మంజుల దంపతులు, కుటుంబ సభ్యులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు.
ఆలయ ఈవో వుడుతల వెంకన్న, ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్ శ్రీదేవి, భూదేవి, లక్ష్మీ అమ్మవార్ల తరఫున కన్యా దాతలుగా వ్యవహరించగా, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ దంపతులు ప్రత్యే కంగా హాజరయ్యారు. తిరుమల నుంచి తెప్పించిన 15 వేల లడ్డూలను భక్తులం దరికీ అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సల్వాజి ప్రవీణ్ ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలు, సాయంత్రం సంగీత కచేరీలు, నృత్యపదన్శనలు ఆకట్టుకున్నాయి.
-కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 18