వేసవి కాలం ప్రారంభానికి ఇంకో రెండు వారాల సమయం ఉన్నా అప్పుడే ఎండలు అదరగొడుతున్నాయి. ఈ నెల మొదటి వారం వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల లోపే ఉండగా, రెండు మూడు రోజులుగా 33 డిగ్రీలు నమోదవుతున్నాయి.
కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ఈ నెల మొదటి వారంలో 18 డిగ్రీల వరకే ఉండగా, రెండు మూడు రోజులుగా 21 డిగ్రీలుగా రికార్డవుతున్నాయి. ఉదయం పదకొండు గంటల నుంచే ఎండ ప్రభావం కనిపిస్తున్నది. వివిధ పనుల కోసం బయటకు వెళ్లే ప్రజలు గొడుగులు పట్టుకెళ్తుండగా, మహిళలు, యువతులు కొంగులు, చున్నీలు కప్పుకుంటున్నారు.
– కరీంనగర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్