రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ను బుధవారం హైదరాబాద్లో పెద్దపల్లి, జగిత్యాల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఇద్దరూ పలు విజ్ఞప్తులు చేయగా, అమాత్యుడు సానుకూలంగా స్పందించారు.
పెద్దపల్లి – ఓదెలకు డబుల్ రోడ్డు నిర్మాణానికి 36 కోట్లు, పెద్దపల్లి – జూలపల్లి డబుల్ రోడ్డు నిర్మాణానికి 19.80 కోట్లు, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు 30 కోట్లు కేటాయింపునకు ఓకే చెప్పారు. నిధులు మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే జగిత్యాలలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయడంతోపాటు తాగునీరు, కరెంట్ సౌకర్యం కోసం 30 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పారు. వెంటనే ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయాలని సూచించారు.