కరీంనగర్ : ప్రజా పాలన పర్యవేక్షణ కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు శ్రీదేవసేనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ జాయింట్ కలెక్టర్గా, పెద్దపల్లి కలెక్టర్గా పని చేసిన అనుభవం ఆమెకు ఉన్నది.
గురువారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరుగనున్న ప్రజా పాలన గ్రామ సభలను ఆమె పర్యవేక్షించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటించి గ్రామసభలను సమర్థ వంతంగా నిర్వహించేందుకు అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ, మండల స్థాయిలో స్పెషల్ అధికారులను ఆయా జిల్లాల కలెక్టర్లు నియమించారు.