సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 17: భద్రాచలం రామాలయంలో బుధవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకలో సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హ రిప్రసాద్ తయారుచేసిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగారు, వెండి, పట్టు జరీతో నేసిన చీరను ఈవో రమాదేవికి హరిప్రసాద్ అందజేశారు. వేదపండితులు కల్యాణంలో సీతమ్మవారికి అలంకరించారు.
ఈసందర్భంగా సీఎస్ శాంతికుమారి హరిప్రసాద్ను అభినందించారు. హరిప్రసాద్ మాట్లాడుతూ రెండు గ్రా ముల బంగారం, 150గ్రాముల వెండి, పట్టుదారాలు వినియోగించి 800గ్రాముల బరువుతో చీరను నేసినట్లు తెలిపారు. తాను నేసిన చీర సీతమ్మవారికి అలంకరించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.