తెలంగాణ చౌక్, జనవరి 6: ప్రయా ణికులను గమ్యస్థానం చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఎస్ ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నది. ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు బస్సులు అందుబా టులో ఉంటాయి. కరీంన గర్ రీజియన్ పరిధిలో నుంచి 830 బస్సులను అదనంగా తిప్ప నున్నారు. జూబ్లీ బస్స్టేషన్ నుంచి కరీంనగర్ వరకు 420 బస్సులు, తిరుగు ప్రయాణంలో ఈనెల 15వ తేదీన కరీంనగర్ నుంచి జూబ్లీ వరకు 410 ప్రత్యేక బస్సులను నడుపుతారు. అ దనపు బస్సులకు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు. సాధారణ చార్జీలు మాత్రమే వర్తిసాయి. ఈనెల 7 తేదీ నుంచి 14 వరకు జూబ్లీ నుంచి కరీంనగర్కు నడిచే 420 బస్సు లు నడుస్తాయి. ఈ నెల 7న జూబ్లీ నుంచి 30 బస్సులు, 8న 30 బస్సులు, 9న 30 బస్సులు, 10న 30 బస్సులు, 11న 50 బస్సులు, 12న 100 బస్సులు, 13న 100 బస్సులు, 14న 50 బస్సులు నడుస్తాయి. అలాగే పండుగ తర్వాత తిరుగు ప్ర యాణంలో కరీంనగర్ నుంచి జూబ్లీ బస్స్టేషన్కు 15న 50 ,16న 100 , 17న 100 , 18న 100 బస్సులు, 19న 30, 20న 30 బస్సు లు నడవ నున్నాయి. వీటితోపాటు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదే శ్కు 28 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. 7న 5 బస్సులు, 8న 4, 9న 2 , 11న 4 , 12న 4 , 13న 4 బస్సులు, 14న 5 బస్సులు ఆంధ్రప్రదే శ్లోని వివిధ ప్రాంతాలకు వెళ్ల నున్నాయి. రద్దీని బట్టి బస్సు ల సంఖ్య పెంచనున్నారు. తిరుగు ప్రయాణ టికెట్ బుకింగ్ చేసు కుంటే టికెట్ మీద 10 శాతం రాయితీ ఉంటుంది. జనవరి 31 లోగా బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రయాణికులను గమ్యస్థానం చేర్చడమే పరమాధిగా సేవలందిస్తున్న ఆర్టీసీ సంకాంత్రి పండుగకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నది. ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయం ఉంది. తిరుగు ప్రయాణం టికెట్ బుక్ చేసుకున్న వారికి టికెట్ మీద 10 శాతం రాయితీ ఉం టుంది. ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయాణికులకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నాం.
– ఖుస్రోషాఖాన్, ఆర్ఎం (కరీంనగర్)
రద్దీకి బట్టి నడిపిస్తాం
సంకాంత్రి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముం దు జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రయాణికులు గమ్యస్థా నం చేరేవరకు నిరంతరం పర్యవేక్షిస్తాం. రద్దీని బట్టి అదనంగా బస్సులను నడిపిస్తాం. టికెట్ను ఆన్లైన్లో బు కింగ్ చేసుకొనే అవ కాశం ఉన్నది. ఆర్టీసీ కల్పిస్తున్న టికెట్ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి.
– మల్లయ్య, మేనేజర్ డిపో-2 (కరీంనగర్)