జ్యోతినగర్, జనవరి 27: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ లేబర్గేట్లో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఎమ్మెల్యే మాట్లాడారు. 2019లో కార్మికుల వేతనాల పెంపుకోసం తాను చేసిన అగ్రిమెంట్ ఆగస్టుతో ముగిసినా కొత్త అగ్రిమెంట్ అమలుపై యాజమాన్యం జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ కొత్త డిమాండ్లపై పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడం తగదని చెప్పారు. ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడాలని లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గత ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కార్మికుల హక్కుల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కార్మికులు ఐక్యంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు. కార్మికుల అభ్యున్నతి కోసం తెచ్చిన ఈఎస్ఐ దవాఖానను త్వరలోనే మంత్రి మల్లారెడ్డి చేతులమీదుగా ప్రారంభింపజేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఇక్కడి కార్మికులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో రామగుండం నగరపాలక మేయర్ డాక్టర్ అనిల్కుమార్ డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, జడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు రమణారెడ్డి, క్రిష్ణవేణి, దొంత శ్రీనివాస్, వేణుగోపాల్, పెద్దపల్లి జిల్లా మల్టీపుల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇజ్జగిరి భూమయ్య, నాయకులు నారాయణదాసు మారుతి, పర్లపలి రవి, కళావతి, ఓదెలు, రామారావు, ఈదునూరి పర్వతాలు, శంకర్, దాసరి ఆనంద్, మలాని, శంకర్గౌడ్, మొహిద్ సన్నీ తదితరులు ఉన్నారు.