కోరుట్ల/కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 21: ‘సీఎం కేసీఆర్ భోళా శంకరుడు.. అడగకముం దే వరాలిచ్చే గొప్ప మనిషి’ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కొనియాడారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి ఆయన సారథ్యంలోని సర్కారుకు పట్టంగట్టాలని పిలుపునిచ్చారు. గురువారం పైడిమడుగు ముదిరాజ్ సంఘ భవనంలో పింఛన్దారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే తన తనయుడు, కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లతో కలిసి హాజర య్యారు. అయిలాపూర్లో రూ. కోటితో నిర్మిం చనున్న డ్రైనేజీ శిలాఫలకాన్ని ఆవిష్కరిం చారు. రూ. 20 లక్షలతో చేపట్టనున్న పీహెచ్సీ-2 భవన నిర్మాణ పనులకు ప్రారంభించారు. అనంతరం అయిలాపూర్, ధర్మారం, యూసూఫ్నగర్, తిమ్మాయిపల్లి, పైడిమడుగు, జోగిన్పల్లి గ్రామాలకు చెందిన 4911 మంది పింఛన్ లబ్ధి దారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.
ఆత్మీయ సమ్మేళానాల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, సంజయ్ కల్వకుంట్లను పార్టీ నాయకులు, లబ్ధిదారులు సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో పల్లెప్రగతిని చేపట్టి గ్రామాల రూపురేఖలు మార్చారని చెప్పారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నేరవేర్చానని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతగాని వారు తెలంగాణలో ఎదో చేస్తామని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాపై నమ్మకంతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఆజన్మాంతం రుణపడి ఉంటానన్నారు. అనారోగ్యంతో తాను పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు.
తన తనయుడు సంజయ్ డాక్టర్గా అందరికి సుపరిచితుడని, కరోనా కష్టకాలంలో నియోజక వర్గ ప్రజలకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. తన కొడుకును భారీ మెజార్టీతో గెలిపిం చాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల గాలిమాటలు నమ్మవద్దని కోరారు. అంతకుముందు మహిళా బిల్లు సాధనకు కృషి చేసిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్ర పటానికి మహిళా ప్రజాప్రతినిదులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ తోట నారాయణ, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, వైస్ ఎంపీపీ చీటి స్వరూప, జిల్లా సర్పంచుల ఫోరం గౌరవఅధ్య క్షుడు దారిశెట్టి రాజేశ్, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ చీటి వెంకట్రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు పిడుగు రాధ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గడిగొప్పుల పీఏసీఎస్ చైర్మన్ చింతకుంట సాయిరెడ్డి, బీఆర్ఎస్వై అధ్యక్షుడు నత్తి రాజుకుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి ప్రదాత. ఆయన ముందుచూపుతో అనేక పథకా లను తెచ్చి అన్నివర్గాలకు మేలు చేశారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చారు. మౌలిక వసతుల కల్పనకు విరివిగా నిధులు ఇస్తున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ అసంబద్ధ ఆరోపణలు చేస్తన్నాయి. ప్రజలను తప్పుదోవపట్టించేందుకు అనేక అబద్ధాలు చెబుతున్నాయి. కోరుట్ల నియోజక వర్గ ప్రజలు మానాన్నపై నమ్మకంతో నాలుగుసార్లు గెలిపిం చారు. ఈ సారి కారు గుర్తుపై ఓటేసి తనను గెలిపించి అసెంబ్లీకి పంపించండి. నియోజకవర్గ ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించండి.
– పైడిమడుగులో పింఛన్దారుల ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ కల్వకుంట్ల