కరీంనగరాన్ని పొగ కమ్మేస్తున్నది. ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. శివారులో ఉన్న డంప్ యార్డుకు మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపిస్తున్నది. దీంతో రాంపూర్, ఆటోనగర్, హనుమాన్నగర్, కృష్ణనగర్ తదితర ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
మంగళవారం సాయంత్రం నుంచే మంటలు అంటుకోవడం, స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. బుధవారం వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నాలు చేసినా, చెత్త నుంచి దట్టమైన పొగ వస్తూనే ఉన్నది. డంప్ యార్డు స్థానంలో తీసుకొచ్చిన బయోమైనింగ్పై శ్రద్ధ చూపకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతున్నది.