సిరిసిల్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా 2వేల హెక్టా ర్లు విస్తరించి ఉండగా, ఎల్లారెడ్డిపేట మండ లం గుండారంలో 351హెక్టార్లు రిజ్వర్వ్ ఫారె స్ట్ భూములున్నాయి. 1974-75లోనే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో వెదురు మొక్కలు నాటారు. అయితే గ్రామం లో 200 ఎకరాలు రెవెన్యూ భూమి (పోరంబోకు) ఉందని, అది గ్రామంలో భూమి కావాలనుకునే వారికి పంచుతామని రెండేండ్ల క్రితం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కొందరితో కలిసి అమాయక ప్రజలను మభ్యపెట్టాడు.
గ్రామంలోని 230మంది నుంచి వెయ్యి చొప్పున వసూలు చేశాడు. అదే సమయంలో అధికారులు హరితహారం కింద లక్షలాది రూపాయలు వెచ్చించి ఆ ప్రాంతం లో మొక్కలు నాటారు. దీంతో గ్రామస్తులు ఏమైందని సదరు వ్యక్తిని అడుగడంతో ఆ మొక్కలకు నిప్పంటించి కాల్చివేశాడు. కొన్నింటిని నరికివేయడం అప్పట్లో మండలంలో కలకలం రేపగా, అధికారులు రంగంలోకి దిగారు. 8మార్చి 2021న సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
కేసీఆర్ సర్కారులో తమ ఆటలు సాగవని మిన్నకుండిపోయిన సదరు నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ వక్రబుద్ధి చూపాడు. ప్రలోభాలు, పైరవీలకు తెరలేపాడు. రెండ్రోజుల క్రితమే గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి భూమి లేనివారికి పోడు భూములు ఇప్పిస్తామని ఆశచూపాడు. ఒక్కొక్కరు ఖర్చుల నిమిత్తం 2వేలు అంటే మొత్తంగా 2లక్షల దాకా ఇవ్వాలని గ్రామస్తులతో చెప్పినట్లు సమాచారం.
అయితే గతంలోనే తలా వెయ్యి ఇచ్చాం.. మళ్లీ ఇప్పుడెందుకు అంటూ పలువురు తర్జనభర్జన పడుతుండగా, మరి కొం దరు భూమి వస్తుందని ఆశతో డబ్బులు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. మరికొందరు అస లు గుండారంలో పోడుభూమి ఉందా..? ఉన్నా.. ఏ ధైర్యంతో మధ్యవర్తి భూమిని ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఆరుగ్యారెంటీల కోసం ప్రభు త్వం ఊరూరా దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే గ్రామానికి చెం దిన సదరు నాయకుడు గృహలక్ష్మి పథకం కింద ఇల్లు ఇప్పిస్తానని, దరఖాస్తు చేసుకోవాలని పలువురు మహిళలకు ఫోన్ చేసి చెప్పాడు. ఇల్లు పేరు రాసుకుంటానని, ఆధా ర్ కార్డు ఇవ్వాలని అడగడం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అంటే తాము చేసుకున్న దరఖాస్తు ఉత్తదేనా..? నేతలు సిఫారసు చేసినవారికే ఇల్లు ఇస్తారా..? అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
‘మీకు ఉండడానికి ఇల్లు కావాలా..? లేదా జాగ కావాలా..? ఏది కావాలన్నా ఇప్పిస్తాం. కానీ అందుకు కొంత ఖర్చువుతుంది. తలా కొంత పోగు చేసి అందిస్తే మీకు కావాల్సింది మేం మంజూరు చేయిస్తాం’ అంటూ పల్లెల్లో దళారుల రాజ్యం మళ్లీ పురుడుపోసుకుంటున్నది.
ప్రభుత్వం మారడంతో ప్రలోభాల పర్వం మొదలైంది. కేసీఆర్ సర్కారులో ఇన్నాళ్లూ సైలెంట్గా ఉనోళ్లు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని ‘ఇది ఇప్పిస్తాం.. అది ఇప్పిస్తామని’ అందినకాడికి దండుకుంటున్నారు. ఇందుకు గుండారం గ్రామంలో ఓ కాంగ్రెస్ నాయకుడి తీరే నిదర్శనంగా నిలుస్తుండగా, ఇదేం పద్ధతి అంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు.
– ఎల్లారెడ్డిపేట, జనవరి 24
గుండారంలో ఎలాంటి పోడు భూమి లేదు. అటవీ భూమిని పోడు భూమిగా చూపించి పట్టాలిప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దు. అటవీ భూమిలోని చెట్లను నరికి వేసే ప్రయత్నం చేసేవారిపై కేసులవుతాయి. చట్టపరమైన చర్యలుంటాయి. భూమి ఇప్పిస్తామని కొందరు డబ్బులు వసూలు చేసినట్లు మాకు సమాచారం అందింది.
– శ్రీనివాస్రావు, ఎఫ్ఆర్వో