Singareni | గోదావరిఖని : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధనలో భాగంగా సింగరేణి అధికారుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్ని ఏరియాలలో నిరసన ర్యాలీల అనంతరం గత వారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేక పోవటంతో సోమవారం నుంచి 13 జులై వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో రిలే నిరాహారదీక్షలు తలపెట్టారు. సీఎంఓఏఐ సింగరేణి బ్రాంచి పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి రిలే నిరాహాదీక్షలు ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా రామగుండం ఏరియా -1, జీఎం కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ప్రారంభించారు RG-1 ఏరియా అధికారులు. సీఎంఓఐ RG1 ఏరియా కమిటీ ఉపాధ్యక్షులు డా.విష్ణు, శ్రీ.కె.మల్లేష్, సెక్రెటరీ,శ్రీ.G.రమేష్ S.E.శ్రీ.సల్మానఖాన్ డిప్యూటీ మేనేజర్,తో పాటు పలువురు అధికారులు మొదటి రోజు దీక్షలు పాల్గొన్నారు. పే అప్ గ్రెడేషన్ , పీఆర్పీ చెల్లింపుతో పాటు ఇతర డిమాండ్లపై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి అని స్పష్టంచేశారు. 13 జులై వరకు జరిగే రిలే నిరాహారదీక్షలు అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, రిలే నిరాహారదీక్షలో పాల్గొనే అధికారులకు ప్రతీ రోజు ఏరియా అధికారులు సంఘీభావం ప్రకటించాలని కోరారు.