సిరిసిల్ల కలెక్టరేట్, జులై 17 : తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026- 27 విద్యా సంవత్సరానికి వాలీబాల్ అకాడమీల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, సరూర్నగర్, మహబూబ్నగర్ వాలీబాల్ అకాడమీల్లో 14- 16, 16- 18 ఏళ్ల వయసు గల తెలంగాణ స్థానిక బాలబాలికలకు శారీరక సామర్థ్యం, క్రీడా నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. సరూర్నగర్లో ఈ నెల 20, 21, సిద్దిపేటలో ఈ నెల 22, 23, మహబూబ్నగర్లో ఈ నెల 25, 26 తేదీల్లో ఎంపిక చేస్తారని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్ ధ్రువపత్రాలు, జిరాక్స్ ప్రతులతో ఉదయం 7 గంటలలోపు సంబంధిత ఎంపిక కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు.