Timmapur | తిమ్మాపూర్, ఫిబ్రవరి 28 : నేషనల్ సైన్స్ డే సందర్భంగా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు తయారుచేసి ప్రదర్శించారు.
తోటి విద్యార్థులకు ప్రాజెక్టులపై వివరించారు. ఇలాంటి సైన్స్ ఫెర్లలో విద్యార్థులు పాల్గొనాలని, జ్ఞానాన్ని పెంచుకోవాలని కరస్పాండెంట్ బర్మయ్య, డైరెక్టర్ జితేందర్, ఉపాధ్యాయులు సూచించారు.