Chigurumamidi | చిగురుమామిడి, మే 21 : చిగురుమామిడి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమం గురువారం నిర్వహించారు. విధులలో ర్యాలీ నిర్వహించి చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని వారికి మెదడు అభివృద్ధికి ఎక్కువ చదివేందుకు ఆటపాటలతో పాటు విద్యను గుర్తుండిపోయేలా నేర్పిస్తున్నట్లు చెప్పారు.
అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం ద్వారా అందించే పౌష్టికాహారం చిన్నారులకు, గర్భిణీ, బాలింతలకు అందించే పలు అంశాలను ఇంటింటా వివరించారు. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులను తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ధనలక్ష్మి, ఇందిర, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంలు ఇర్షత్, సుజాత, సీఆర్పీ ఆంజనేయులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.