కమాన్చౌరస్తా, జూన్ 10: రాజ్యసభ సభ్యుడు, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్ రావును శుక్రవారం హైదరాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎస్ మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు.
శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇక్కడ యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు.