Chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 2: చిగురుమామిడి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలను గౌడ సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు గురువారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నైజాం పాలకులను ఎదిరించి ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన మహనీయుడు అని కొనియాడారు. వారు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.
వారి స్ఫూర్తి నేటి యువతరానికి ఎంతో ప్రయోజనం అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ఆకవరం భవాని, ఉప సర్పంచ్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు ఆకవరం శివప్రసాద్, ఎండీ సర్వర్ పాషా, బెజ్జంకి రాంబాబు, బెజ్జంకి లక్ష్మణ్, ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మార్క రాజ్ కుమార్, దాసరి ప్రవీణ్ కుమార్, పొన్నం శ్రీనివాస్, పూదరి వేణు, గౌడ సంఘం నాయకులు బండారుపల్లి రామచంద్రం, బొమ్మగాని వెంకటేశం, బూరుగు సంజీవ్, తిరుపతి, రాజయ్య, శ్రీనివాస్, సంపత్, వివిధ పార్టీల నాయకులు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.