విద్యా సంస్థలకు ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. దీంతో హాస్టల్ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం నుంచి ఇంటిబాట పట్టారు. మరోవైపు వరుస సెలవులతో ప్రజలు కూడా స్వగ్రామాలకు వెళ్లేందుకు బయలు దేరారు. సాయంత్రం పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకున్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లు రద్దీగా మారాయి.
ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయి కనిపించాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాకేంద్రంలోని కరీంనగర్ బస్స్టేషన్ అయితే వేలాది మందితో కిటకిటలాడింది. సరిపడా బస్సులు లేక గంటల కొద్ది ఎదురుచూడాల్సి వచ్చింది.
– కరీంనగర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్