ముత్తారం, ఫిబ్రవరి 27: ఇసుక రీచ్లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. రూట్మ్యాప్ లేకుండా లారీలకు అనుమతించడం, వచ్చి న వాహనాలను వెంట వెంటనే లోడ్ చేయకపోవడం, ప్రధాన రహదారిపై రోజు ల తరబడి నిలిపి ఉంచడంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ముత్తారం మండలం జిల్లెలపల్లి, ఖమ్మంపల్లి, అడవిశ్రీరాంపూర్, ఓడేడు, ముత్తారంలో క్వారీలు నడుస్తున్నాయి. అయితే కొద్దిరోజులుగా లారీలు వందల సంఖ్యలో వచ్చి బారులు తీరి ఉంటున్నాయి. టీఎస్ఎండీసీ అధికారులు అధిక మొత్తంలో ఆన్లైన్లో క్వాంటీ టీ పెట్టడం వల్లే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తుండగా, ఒక ముత్తారం, ఓడేడు ఇసు క రీచ్లోకి రోజుకు సుమారు 150 నుంచి 200 లారీలు తరలివస్తున్నాయి. రీచ్ నిర్వాహకులు పార్కింగ్ స్థలాలు కేటాయించినప్పటికీ సరిపోకపోవడం, వచ్చిన లారీలకు అనుగుణంగా లోడ్ చేయకపోవడంతో ఓడే డు, మంథని మెయిన్రోడ్పై కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. ఫలితంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుండగా, ప్రయాణికులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఈ క్రమంలోనే మంగళవారం భూపాలపల్లి జిల్లా చిట్యాల నుంచి గోదావరిఖనికి పేషెంట్ను తరలిస్తున్న ఓ వాహనం ఓడేడు-ముత్తారం మధ్యన రోడ్డుపై గంటసేపు ట్రాఫిక్లో నిలిచిపోగా, ఆ పరిస్థితిని చూసి ఇతర ప్రయాణికులు ఆగ్రహించారు. రెండు లారీల అద్దాలను పగులగొట్టారు. సదరు పేషంట్ను వేరే మార్గంలో పంపించారు. అయితే టీఎస్ఎండీసీ చెప్పిన రూట్ మ్యాప్ ప్రకారం కాకుం డా లారీలు ఎవరికి తోచిన విధంగా వారు తీసుకెళ్లడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. ఉదాహరణకు వరంగల్ రూట్ లారీ ఓడేడు రీచ్లో ఇసుక నింపుకున్న తర్వాత లారీ మంథనివైపు వెళ్లి, అక్కడి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కాటారం భూపాలపల్లి పరకాల మీదుగా వరంగల్ వెళ్లాల్సి ఉం టుంది. కానీ, డిజీల్, సమయం కలివస్తుందని ఓడేడు నుంచి రాంగ్రూట్లో వచ్చి మానేరులో వేసిన అక్రమ మట్టిరోడ్డు గుం డా గర్మిళ్లపెల్లి, టేకుమట్ల, చిట్యాల, పరకాల మీదుగా వెళ్తున్నాయి. ఇదే అదునుగా ఆ మ ట్టి రోడ్డుపై వెళ్లేందుకు ఒక్కో లారీకీ వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మార్గం నుంచి రోజుకు 50 నుంచి 60 లారీ లు వెళ్తుండగా, రాకపోకలకు ఆటంకం ఏర్పడుతున్నదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, రూట్ మ్యాప్ ప్రకారం లారీలను పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.