వన దేవతలు సమ్మక్క, సారలమ్మ శనివారం సాయంత్రం వనప్రవేశం చేశారు. చివరి రోజూ భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.. తల్లులు అడవిలోకి వెళ్లే వరకు మొక్కులు చెల్లించి, ‘సల్లంగ సూడు తల్లీ’ అని వేడుకున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన జాతర్లలో సమ్మక్క, సారలమ్మకు లక్షల సంఖ్యలో భక్తులు హారతిపట్టారు. ఒక్కో జాతర మినీ మేడారాన్ని తలపించింది. రేకుర్తి, కేశవపట్నంతోపాటు గోదావరిఖని, నీరుకుల్ల, కొలనూర్, వీణవంకలో లక్షలాది మంది మొక్కులు చెల్లించుకోవడం కనిపించింది. ఈ నెల 21న ప్రారంభమైన జాతరలు.. శనివారం సాయంత్రం గిరిజన దేవతలు వనంలోకి వెళ్లడంతో ముగిశాయి.
– కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 24
కమాన్చౌరస్తా/కరీంనగర్రూరల్/హుజురాబాద్టౌన్/జమ్మికుంట/శంకరపట్నం/సైదాపూర్/చొప్పదండి, ఫిబ్రవరి 24: సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా శనివారం సాయంత్రం కోయపూజారులు అమ్మవారిని వనంలోకి తీసుకెళ్లారు. ఈ క్ర మంలో ఉద యం నుంచే భక్తులు పెద్ద సం ఖ్యలో గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించారు. ఎత్తు బంగారం తీసు కువచ్చి అమ్మవార్లకు సమర్పించారు. ఒడి బియ్యం, ఎదురు కోళ్లు అప్పగించి అమ్మవా ర్లకు మొక్కులు చెల్లించారు. దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆకునూరి చంద్రశేఖర్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణి-హరిశంకర్, కొత్తపలి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, సివిల్ సైప్లె కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు పొన్నం అనిల్కు మార్ గౌడ్ అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
వేడుకల్లో కార్పొరే టర్లు సుధగోని మాధవీకృష్ణా గౌడ్, ఎదుల్ల రాజశేఖర్, ఆలయ వ్యవస్థాపక కమిటీ చైర్మన్ పిట్టల శ్రీనివాస్, ఈవో మారుతి, జూనియర్ అసిస్టెంట్ గుడికాడి శ్రీనివాస్, సిబ్బంది, పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని హౌసింగ్ బోర్డు కాల నీలో విద్యుత్ ఎస్ఈ గంగాధర్ దంపతులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకు న్నారు. అమ్మవార్లను మేడారం కోయ పూజారులు కృష్ణ, సమ్మ య్య వన ప్రవేశం చే యించారు. జాతర నిర్వాహకులు మోహన్, అనిల్కుమార్, నరేందర్, తిరుపతిగౌడ్, సాగర్, లింగ మూర్తి, కిరణ్కుమార్, సాయిల శివయ్య ఒగ్గు కళా బృందం, డీఈ తిరుపతి రెడ్డి పా ల్గొన్నారు. అలాగే, మండలంలోని నగు నూర్, ఇరుకుల్ల, బొమ్మకల్లో గల గద్దెల వద్ద భక్తులు అమ్మవార్లను దర్శించు కొని మొక్కులు చెల్లించుకున్నారు. హుజురా బాద్ శివారులోని రంగనాయకులగుట్ట వద్ద, పెద్దపాపయ్యపల్లిలో అమ్మవార్లను భక్తులు దర్శించుకొని, పూజలు చేశారు.
జమ్మికుంట పట్టణ పరిధిలోని కేశవాపూర్, తనగుల, వావిలాల గ్రామాల్లో సమ్మక్క-సారలమ్మను కోయపూజారులు వన ప్రవేశం చేయించారు. జాతరలో ఏర్పాట్లను మున్సి పల్ చైర్మన్ రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్ స్వప్న-కోటి, కమిషనర్ ఎండీ అయాజ్, తదితరులు పర్య వేక్షించారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి, సైదాపూర్లో సమ్మ క్క-సారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. వెన్నంపల్లిలో అమ్మ వార్లను మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి దర్శించుకున్నారు. అలాగే, మత్య్సగిరీంద్ర స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. వీణవంకతో పాటు చల్లూరు, పోతి రెడ్డిపల్లి, కోర్కళ్, గంగారం గ్రామాల్లో ఉత్సవ కమిటీ చైర్మన్లు పాడి రామకృష్ణారెడ్డి, కర్ర హరిణ్రెడ్డి, పరిపాటి గోపాల్రెడ్డి, పవన్రెడ్డి, గడ్డం కుమార్ ఆధ్వర్యంలో సమ్మక్క-సారల మ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగింది. కేశవప ట్నంలో అమ్మవార్లను మహా రాష్ట్ర, చత్తీస్ ఘడ్, ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించు కున్నారు. సుమారు లక్షా యాబై వేల మంది భక్తులు అమ్మ వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు జాతర కమిటీ చైర్మన్ గుర్రం స్వామి, ఈవో మారుతీరావు తెలిపా రు.
చొప్పదండితో పాటు రాగంపేట, గుమ్లాపూర్, ఆర్నకొండ గ్రామాలలో జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతర శనివారం ముగిసింది. సమ్మక్క-సారలమ్మ బుధ, గురు, శుక్ర వారాల్లో జనావసంలోకి రావడంతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.వనంలోకి తల్లులు వన దేవతలు సమ్మక్క, సారలమ్మ శనివారం సాయంత్రం వనప్రవేశం చేశారు. చివరి రోజూ భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.. తల్లులు అడవిలోకి వెళ్లే వరకు మొక్కులు చెల్లించి, ‘సల్లంగ సూడు తల్లీ’ అని వేడుకున్నారు.
నాలుగు రోజుల పాటు జరిగిన జాతర్లలో సమ్మక్క, సారలమ్మకు లక్షల సంఖ్యలో భక్తులు హారతిపట్టారు. ఒక్కో జాతర మినీ మేడారాన్ని తలపించింది. రేకుర్తి, కేశవపట్నంతోపాటు గోదావరిఖని, నీరుకుల్ల, కొలనూర్, వీణవంకలో లక్షలాది మంది మొక్కులు చెల్లించుకోవడం కనిపించింది. ఈ నెల 21న ప్రారంభమైన జాతరలు.. శనివారం సాయంత్రం గిరిజన దేవతలు వనంలోకి వెళ్లడంతో ముగిశాయి.
– కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 24