రామడుగు, జనవరి 9 : ప్రజల ఆరోగ్య రక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం గుండి, గోపాల్రావుపేట తిర్మలాపూర్ గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఆరోగ్య ఉపకేంద్ర నూతన భవన నిర్మాణ పనులు చేపడుతూ, శిలాఫలకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ, పూర్వం తెలంగాణ ప్రాంతంలో ప్రజ లు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే, నేనురాను బిడ్డో సర్కారు దవఖానకు అని పాటలు పాడుకునేవారన్నారు.
నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పల్లెపల్లెకు పల్లె దవాఖానలు వచ్చాయన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా, పోదాం పద బిడ్డో సర్కారు దవాఖానకు అని చెప్పుకుంటున్నారన్నారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దారన్నారు. నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో తెలంగాణ వైద్యశాఖ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని 51 పల్లె దవాఖానల నిర్మాణాలకు 10కోట్ల 20 లక్షల నిధులను తీసుకొని వచ్చామని పేర్కొన్నారు. గ్రామస్తులు పల్లె దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా గుండి లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటుకు భూమిని అందించిన దాతలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో భూదాతలు రాచూరి రత్నయ్య, డా.శ్యాం సుందర్, డా.విశ్వనాథం, సుధాకర్, నాగమణి, కాశీనాథ్, ఆంజనేయులు, ప్రవీణ్కుమార్, గట్ట య్య, సర్పంచులు గుండి మానస ప్రవీణ్, కర్ర సత్యప్రసన్న, బక్కశెట్టి నర్సయ్య, ఎంపీటీసీ మడ్డి శ్యాంసుందర్ గౌడ్, ఉప సర్పంచ్ మేడి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, ఎంపీటీసీల ఫో రం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, మా జీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు కొలిపాక మల్లేశం, కొడిమ్యాల రాజేశం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, నాయకులు శనిగరపు అర్జున్ పాల్గొన్నారు.