కరీంనగర్ : జిల్లాలోని హుజూరాబాద్ మండలం సింగపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ఫ్యామిలీ వేములవాడ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు, గాయపడిన వారు వరంగల్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.