ధాన్యం గోల్మాల్కు పాల్పడడంతో పాటు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైస్మిల్ యజమాని బాగోతం బయటపడింది. రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ సమక్షంలో పౌరసరఫరాల శాఖ అధికారులు చేసిన తనిఖీలు చేయగా, ఏకంగా 40 లారీలకుపైగా బస్తాల ధాన్యం తేడాలున్న విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు అధికారులను మభ్యపెట్టేందుకు కింద తెల్ల బ్యాగుల్లో ధాన్యం నింపి, పైన మాత్రం ప్రభుత్వ గన్నీ బ్యాగులను ఉంచినట్లు గుర్తించిన అధికారులు, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
కరీంనగర్, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వం ఉదాత్త ఆశయంతో సీ ఎంఆర్ కింద మిల్లులకు కేటాయిస్తున్న ధాన్యా న్ని కొం త మంది మిల్లర్లు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటువంటి వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హుజూరాబాద్లోని ఓ రైస్మిల్లులో జరిగిన గోల్మాల్ చూసి అధికారులే షాక్ గురైన విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే గురువారం హు జూరాబాద్లోని హనుమాన్ రైస్ మిల్లులో ప్ర భుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లుగా సివిల్ సైప్లె కార్పొరేషన్కు ఫిర్యాదు అం దింది. ఆ మేరకు కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ సమక్షంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేషన్రెడ్డి ఇతర అధికారులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు.
మిల్లు పరిధిలో జరిగిన అక్రమాలను చూసి అధికారులు షాక్ గురైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చి న ధాన్యం 40 లారీలకుపైగా కనిపించని విషయాన్ని గుర్తించిన అధికారులు పూర్తి వివరాలు ఆరా తీశారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే.. సదరు యజమాని పొంతన లేని సమాధానాలు చెప్పారని సమాచారం. మిస్సయిన ధాన్యం వేరే చో ట గోదాముల్లో పెట్టామని సదరు వ్యాపారి చె ప్పగా, అందుకు అనుతులున్నాయా అని అధికారులు ప్రశ్నించగా.. లేవని సమాధానం చె ప్పారని తెలుస్తోంది. అంతేకాదు మిల్లులో ఉన్న ధాన్యపు బస్తాలను లెక్కించే తరుణంలో అధికారులు అక్కడ ఉన్న బస్తాలను చూసి షాక్ కు గురైనట్లు ఓ అధికారి తెలిపారు. పైన గన్నీ బ్యాగుల్లో ధాన్యం ఉంచి, కింద మాత్రం తెల్ల బ్యాగుల్లో ధాన్యం నింపి అధికారుల కండ్లు కప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు అసలు తెల్ల బ్యాగులు మిల్లుల్లో ఎందుకున్నాయన్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పలేదని విశ్వసనీయ సమాచారం.
నిబంధనల ప్రకారం గన్నీబ్యాగుల్లోనే ధాన్యం ఉండా లి. ఇతర బ్యాగులు ఉండడానికి వీలులేదు. దీనిపై మరింత లోతు గా విచారణ చేస్తున్న అధికారులు, కేసు నమోదు చేసి చట్టపరమైన చర్య లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ను ‘నమస్తే తెలంగాణ’ వివరాలు అడిగితే ‘తనిఖీ చేసిన మాట వాస్తవమే. హనుమాన్ రైస్ మిల్లు లో సదరు యజమాని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన విషయా న్ని గుర్తించాం. లెక్కకు దొరకని ధాన్యం గురిం చి వివరాలు అడిగాం. అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నరు. నిబంధనలు ఉ ల్లంఘించిన సదరు యజమానిపై కేసు నమో దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చాం. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించే ప్రశ్నేలేదని, ఇందులో భాగంగానే సదరు యజమానిపై చర్యలు తీసుకోవాలని అదేశించాం’ అని తెలిపారు.