BRS | సిరిసిల్ల టౌన్, జూలై 9: ప్రజాపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి పాలన చేతగాక బూతు మాటలకు కేరాఫ్ అడ్రగా మారిపోయాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేఖంగా పనిచేసిన రేవంత్ రెడ్డి రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని అన్నారు. ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, అదే తరహాలో బండి సంజయ్ యాక్సిడెంటల్ గా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నాడని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆంద్రపాలకుల మోచేతి నీళ్లు తాగే వ్యక్తులు రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ రాష్టాన్ని అభివృద్ధి పథంలో నిలిపారని కొనియాడారు. తమ పాలనతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నాయకులు కేటీఆర్, హరీష్ రావు అని తెలిపారు. రేవంత్ రెడ్డి పాటు ఆయన మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్, కేటీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని వాపోయారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పని చేస్తున్న ఏ ఒక్క నాయకుడికి ప్రజాసమస్యలపై పట్టింపులేదన్నారు.
పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి పాల్గొనే వేదికలన్నింటిలో ప్రజాసమస్యలు, అభివృద్ధిని గాలికి వదిలేసి కేసీఆర్, కేటీఆర్ ను బూతు మాటలు తిట్టేందుకే వినియోగించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. డబ్బు సంచులతో నాడు పీసీసీ అధ్యక్ష పదవితో పాటు నేడు ముఖ్యమంత్రి పదవులను కొన్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కనీస రాజకీయ పరిణతి గాని, అవగాహన గాని లేదన్నారు. ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతూ పొద్దుగడుపుతున్నారని అన్నారు.
రైతు సమస్యలపై దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా చర్చకు రావాలని సవాల్ విసిరి రేవంత్ డిల్లీకి పారిపోయాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు మాత్రమే సవాల్ చేశారంటూ కాంగ్రెస్ మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిచ్చిబట్టినట్లు మాట్లాడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. సీతక్క ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో గత ప్రభుత్వంలో ఆమె నియోజకవర్గానికి కేటీఆర్ అనేక నిధులు మంజూరు చేశారని తెలిపారు. అటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ పై సీతక్క చేస్తున్న విమర్శలకు ప్రజలు ముగింపు పలుకుతారని అన్నారు.
బీర్ల ఐలయ్య, రాంచంద్రనాయక్, సామ రాంమోహన్రెడ్డి లాంటి బచ్చా నాయకులు రేవంత్రెడ్డికి వంతపాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు. ఆంధ్రపత్రిక యజమాని రాధాకృష్ణ తెలంగాణ రాష్ట్ర వినాశనాన్నే కోరుకుంటాడన్నారు. తెలంగాణ రాష్ట్రo బాజాప్తా తెలంగాణ బిడ్డల జాగిరేనని గుర్తుంచుకోవాలన్నారు. వ్యాపారం కోసం బ్రోతల్ పనులు చేస్తున్నాడని, పత్రిక ముసుగులో అనేక అక్రమాలు చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడని అన్నారు.
తెలంగాణ ప్రజల చేతిలో నీ పతనం తప్పదని హెచ్చరించారు.. రాష్ట్ర అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదని అదే తరహాలో ప్రజా పాలన పేరుతో అక్రమ పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డికి సైతం ప్రజలు గోరి కడతారని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్యయాదవ్, న్యాలకొండ రాఘవరెడ్డి, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, మ్యాన రవి, కుంబాల మల్లారెడ్డి, గడ్డం భాస్కర్, కంచర్ల రవిగౌడ్, సాయి, అనీల్, తదితర నాయకులు పాల్గొన్నారు.