Rekonda | చిగురుమామిడి, ఫిబ్రవరి 14 : సీఎం కప్ టోర్నమెంట్ లో భాగంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కరీంనగర్ జిల్లా చిగు రుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన క్రీడాకారులు హుస్నాబాద్ డివిజన్ నుండి కబడ్డీ ఆడి ఎంపికయ్యారు. కరీంనగర్లో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలో హుస్నాబాద్ డివిజన్ నుండి ప్రాతినిధ్యం వహించి కరీంనగర్ క్లబ్ పై గెలుపొందారు.
ఉత్తమ ప్రతిభను కనబడడంతో గ్రామానికి చెందిన మేకల మధు, పిట్టల నరేష్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. గత సంవత్సరం సీఎం కప్ కబడ్డీ పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం మరోసారి ఎంపిక కావడం ఆనందంగా ఉంద ని వారు పేర్కొన్నారు. గ్రామం నుండి రాష్ట్రస్థాయికి క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల సర్పంచ్ అల్లెపు సంపత్, మాజీ సర్పంచ్ పిట్టల రజిత, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.