జగిత్యాల టౌన్, డిసెంబరు 11: జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో సన్నగింజ రకం ధాన్యం రేటు పరుగులు తీస్తున్నది. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నది. నవంబర్ చివరి వారం నుంచి జై శ్రీరాం ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర నమో దు కాగా, సోమవారం రికార్డు స్థాయిలో క్వింటాల్కు 3,221 ధర నమోదైంది. సన్నాలకు 3 వేలకు పైబడి ధర పలకడం మూడేండ్లలో ఇదే మొదటిసారి. కాగా, వ్యవసాయ మార్కెట్కు సోమవారం వరకు జైశ్రీరాం ధాన్యం 31,265 క్వింటాళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
జైశ్రీరాం ధాన్యం క్వింటాల్కు అక్టోబర్ 13న వ్య వసాయ మార్కెట్ రాగా, ప్రారంభం ధర 2,325గా ఉంది. నవంబర్ మొదటి వారంలో 2,505, చివరి వారంలో 3058 ధర నమోదైంది. డిసెంబర్లో కొద్దికొద్దిగా పెరుగుతూ సో మవారం అత్యధికంగా 3,221 ధర పలికింది.
హెచ్ఎంటీ ధాన్యం క్వింటాల్కు నవంబర్ మొదటి వారంలో 2201 ధర పలుకగా, చివ రి వారంలో 2525కు పెరిగింది. డిసెంబర్లో కొద్దికొద్దిగా పెరుగుతూ సోమవారం అత్యధికం గా 2.725 ధర పలికింది.
బీపీటీ రకం క్వింటాల్కు నవంబర్ మొదటి వారంలో 2,211 ధర నమోదుకాగా, చివరి వా రంలో అంతే ధర కొనసాగింది. డిసెంబరు నెలలో తక్కువ మొత్తంలో పెరుగుతూ వచ్చింది. సోమవారం 2,225గా ధర పలికింది.
ఆర్ఎన్ఆర్ రకం క్వింటాల్కు నవంబర్ 15న 1955 ధర పలికింది. చివరి వారంలో ధర పెరిగింది. డిసెంబర్ 11న 2,640గా నమోదైంది.