land registrations | గంగాధర, మే 28: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేషన్ లను రద్దు చేయడానికి అధికారులు సమయుత్తమైనారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 175, 197, 198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆర్డీవో మహేశ్వర్, జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. అన్ని సవ్యంగా సాగితే నాలుగు రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
30 ఏళ్లుగా సీలింగ్ యాక్ట్ అమలులో ఉన్న, సదరు భూముల్లో రిజిస్ట్రేషన్లు చేయవద్దని హైకోర్టు ఆర్డర్ ఉన్న, భూముల రిజిస్ట్రేషన్ పై సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఐదుసార్లు నోటీసులు వచ్చిన, వాటన్నిటిని భేకారతు చేస్తూ కొందరు సబ్ రిజిస్టార్లు, కొంతమంది అక్రమాకులతో కలిసి భూముల రిజిస్ట్రేషన్ చేశారు. సీలింగ్ భూముల విషయం తెలియక అమాయక ప్రజలు అక్రమార్కుల వేసిన ఉచ్చులో చిక్కి భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు రద్దు కావడంతో ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
కొత్తపల్లి మండలంలోని సర్వే నెంబర్లు 175, 197, 198 లలో చేసిన భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని జిల్లా కార్యాలయం నుండి గత పది రోజుల క్రితం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి నోటీసులు అందాయి. సదరు భూములపై 30 ఏళ్లుగా సీలింగ్ యాక్ట్ అమనులో ఉంది, ఎలాంటి లావాదేవులు జరపకూడదని హైకోర్టు ఆర్డర్ ఉంది. 175, 197, 198 సర్వే నెంబర్లలో సుమారు 20 ఎకరాల భూమి ఉండగా సదరు సర్వే నెంబర్లలో ఎలాంటి లావాదేవులు జరపవద్దని 1997, 1998, 2006, 2011, 2016 లో కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి నోటీసులు అందాయి.
హైకోర్టు ఆర్డర్, కలెక్టర్ నోటీసులను బేకారతు చేసిన కొందరు సబ్ రిజిస్టార్లు సర్వే 175 లో 3, 197 లో 291, 198 లో 182 రిజిస్ట్రేషన్లు చేశారు. 2018 వరకు కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో ఉన్న కొత్తపెళ్లి మండలాన్ని గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మార్చారు. కానీ అప్పటికే కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 424 రిజిస్ట్రేషన్లు జరగగా, గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 52 రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఒకటి మాత్రమే లోకాయుక్త ఆదేశాల అమ్మాయిలకు జరిగినట్లు తెలిసింది. కొత్తపెల్లి భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్ లపై లోక్సత్తా నాయకులు చేసిన పోరాటంతో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ విషయం తెలుగులోకి వచ్చింది. లోకాయుక్త సూచనల మేరకు జిల్లా కలెక్టర్ పమేలసత్పత్తి సర్వే నంబర్లు 175, 197, 198 ఇప్పటివరకు జరిగిన 476 రిజిస్ట్రేషన్ లను రద్దు చేయాలని స్టేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
అవినీతి అధికారులపై చర్యలు ఉండేనా..?
175, 197, 198 సర్వే నెంబర్లలో ఫీలింగ్ యాక్ట్ అమల్లో ఉన్న, సర్వే నంబర్లలో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని హైకోర్టు ఆర్డర్ ఉన్న, భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఐదుసార్లు కరీంనగర్ రూరల్, గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నోటీసులు అందినా వాటిని బుట్ట దాఖలు చేసి రిజిస్ట్రేషన్లు చేసిన అవినీతి అధికారులపై ఉన్నతాధికారుల చర్యలు తీసుకుంటారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పిన్నెల్లిగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్న ఉన్నతాధికారులకు తెలియలేదా, కావాలనే వారు పట్టించుకోలేద అని ప్రజల నుండి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కలిపి రిజిస్ట్రేషన్లకు సంబంధించి కోట్లాది రూపాయలు అవినీతి జరిగి ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రొహిబిటెడ్ భూముల్లో భూ విక్రయాలు చేసిన అక్రమార్కులు, వారిని ప్రోత్సహించిన సబ్ రిజిస్టార్లపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావని ప్రజలు కోరుతున్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకే రిజిస్ట్రేషన్లు రద్దు: మహేశ్వర్, ఆర్డీవో
175, 197, 198 సర్వే నెంబర్లలో అక్రమంగా జరిగిన 477 రిజిస్ట్రేషన్ లను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియను ప్రారంభించాము. మీ సవ్యంగా సాగితే నాలుగు రోజుల్లో ట్రాన్సిలేషన్ను పూర్తి చేస్తాము. రిజిస్ట్రేషన్ లో రద్దు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాము.
నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం : ప్రవీణ్ కుమార్, డిఆర్
175, 197, 198 సర్వే నంబర్లలో అక్రమంగా జరిగిన 476 రిజిస్ట్రేషన్లలో ఏ ఏ సబ్ రిజిస్టర్ ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారు, ఏ సంవత్సరంలో చేశారు అన్న వివరాలను సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల రద్దు పూర్తయిన తర్వాత పూర్తి నివేదికను తయారుచేసి కొన్నతాధికారులకు పంపిస్తాను. విచారణ చేసిన తర్వాత ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు.