కోల్సిటీ, ఆగస్టు 17: ప్రగతిలో పరుగులు తీస్తున్న రామగుండానికి నిధుల వరద పారింది. ఎమ్మెల్యే చందర్ కృషి ఫలించింది. గత మే నెల 8న నియోజకవర్గ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తాజాగా రూ.50కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ‘ప్రకటనలు చేయడం కాదు.. నిధులు మంజూరు చేయించాలని’ ఇన్నాళ్లూ నియోజకవర్గంలో రచ్చచేసిన ప్రతిపక్షాలకు గట్టి షాక్తగిలినట్లయింది.
‘మీ రామగుండం కోసం ఎంతో తపన పడుతున్న మా సోదర సమానుడు మీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను మీరంతా కడుపులో పెట్టుకొని చూసుకోవాలె. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన నిధులు కావాలని అడుగుతున్నాడు. త్వరలోనే రామగుండానికి అదనంగా మరో రూ.100 కోట్లు మంజూరు చేస్తా…’ గత మే 8న రామగుండంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన అమాత్యుడు కేటీఆర్ అన్నమాటలివి. ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు రూ.50 కోట్లు మంజూరు చేయించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, సీ.సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మౌలిక సదుపాయాల సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా కార్పొరేషన్కు రూ.50 కోట్లు నిధు లు రుణం రూపేణా సమకూర్చాలని ఉత్తర్వులు విడుదల చేశారు. కార్పొరేషన్ పరిధిలో ఇంకా చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు ఈ నిధులను వెచ్చించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ నిధుల మంజూరు పట్ల కార్పొరేషన్ ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
రామగుండం ఎమ్మెల్యే చందర్ మాట నిలుపుకోవడంలో అసాధ్యుడని మరోసారి నిరూపించుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తపించే ఆయన ఇప్పటివరకు ఎన్నో అసాధ్యాలను సు సాధ్యం చేశారు. రామగుండానికి మెడికల్ కళాశాల అసాధ్యమని ప్రతిపక్షాలు అపహాస్యం చేస్తే, సీఎం కేసీఆర్ను ఒప్పించి మంజూరు చేయించా రు. తర్వాత రామగుండానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, నూతన కోర్టు భవనాలు మంజూరు చేయించారు. ప్రస్తుతం రామగుండంలో ఐటీ టవర్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ సూచనలతో అమెరికా వెళ్లిన ఆయన, అక్కడ పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపారు. గత మే నెల 8న రామగుండంలో పలు అభివృద్ధి పనుల పైలాన్ ప్రారంభానికి మంత్రి కేటీఆర్ను తీసుకవచ్చిన చందర్, ఆయనను ఒప్పించి రామగుండం అభివృద్ధికి మరో రూ.100 కోట్లు ఇస్తామని నిండు సభలో చెప్పించారు. ఆ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను చందర్ కలిసి నిధుల మంజూరు విషయమై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే అభివృద్ధి పనులకు సంబంధించి మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొని టీయూఎఫ్ఐడీసీ ద్వారా ప్రస్తుతానికి రూ.50 కోట్లు రుణం మంజూరు చేయించారు.
రామగుండం అభివృద్ధికి రూ.100 కోట్లు తెస్తామని ఎమ్మెల్యే చందర్ చెప్పినట్టుగా నిధులు మంజూరు చేయించాలని కొద్ది రోజులు గా ప్రతిపక్ష నేతలు సవాల్ విసురుతున్నారు. కార్పొరేషన్లో ఎక్కడ సమావేశాలు జరిగినా అక్కడ ఇదే విషయమై ప్రస్తావిస్తూ ‘కార్పొరేషన్కు రూ.100 కోట్లు ఇప్పిస్తున్నట్లు చెప్పడం కాదు.. ఆ నిధులు తీసుకవచ్చి చూపించాలంటూ’ ప్రశ్నించారు. కానీ, ఎప్పటిలాగే ప్రతిపక్షాల మాటలు అవేమి పట్టించుకోని ఎమ్మెల్యే చందర్ మాత్రం తనదైన శైలిలో ప్రయత్నాలు చేసి, రూ.50 కోట్లు నిధులు మంజూరు చేయించడంలో సఫలీకృతులయ్యారు. దీనితో ప్రతిపక్షాల ముఖం తెల్లబోయినట్లయింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్కు ఇప్పటివరకు రూ.300 కోట్లు నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కొప్పుల ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ ప్రాంత ప్రజలకు ఏ మాట ఇచ్చిన నిలబెట్టుకునే మనస్తత్వం నాది. ప్రతిపక్షాల మాటలు ఎప్పటికీ పట్టించుకోను. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వరన్నల ఆశీస్సులతోనే ముందుకు వెళ్తున్నా.
– కోరుకంటి చందర్, ఎమ్మెల్యే