గోదావరిఖని, నవంబర్ 15: నాలుగున్నరేండ్లు కనుమరుగైన కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు రాగానే అబద్ధపు హామీలు ఇస్తూ ఆపద మొక్కులతో ప్రజల ముందుకు వస్తున్నారని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి నాయకుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పేదల పాలిట దేవుడిగా నిలిచిన కేసీఆర్ సర్కారును ఆదరించాలని విజ్ఞప్తిచేశారు. బుధవారం 47వ డివిజన్ అడ్డగుంటపల్లిలోని ప్రజా ఆశీర్వాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యమనేత కేసీఆర్ చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సా ధించి..అనంతరం ప్రజల మద్దతుతో గద్దెనెక్కి ప్రజారజంక పాలన అందిస్తున్నారని కొనియాడారు. నన్ను నమ్మించి గెలిపించిన నా రామగుండం ప్రజానీకం ఆరోగ్యం కోసం ఇక్కడ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయించానని చెప్పారు.
ఆరోగ్యలక్ష్మి కింద ఆడబిడ్డలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకంను అందిస్తున్నా సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలన్నారు. కొత్త మ్యానిఫెస్టోలో గత పథకాల కొనసాగింపుతోపాటు వాటికి మరింత ఆర్థిక లబ్ధిని చేకూర్చుతూ కొత్త పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ ప్రాంతంలో 500 కోట్లతో మెడికల కాలేజీ, 30 కోట్లతో ఐటీ పార్కు, ఇండస్ట్రీయల్ పార్కు, 26 కోట్లతో సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల సముదాయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఆరు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పెద్దంపేట, రాయదండి రైతులకు ఖర్జు కమ్మి భూములకు పట్టాలు అందించామన్నారు. దాదాపు 65వేల కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులుగా ఉన్నారన్నారు. ఈనెల 18న రామగుం డంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ రోడ్డు షోలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ అనిల్కుమార్, నాయకులు మూల విజయారెడ్డి, జక్కుల తిరుపతి, మేకల సమ్మయ్య, రత్నాకర్, సత్యప్రసాద్, సన్ని, అబ్బాస్, శ్రావణ్, స్వప్న తదితరులు ఉన్నారు.