యైటింక్లయిన్కాలనీ/పాలకుర్తి అక్టోబర్ 30: కార్మికుడి బిడ్డగా.. మీ కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా సింగరేణి కార్మికులకు ఉండగా ఉంటానని, కష్టాల్లో కన్నీళ్లను తుడుస్తానని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ భరోసాఇచ్చారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి ఐటీ మినహాయింపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సోమవారం ఆర్జీ-2లోని ఓసీపీ-3 కృషి భవన్లో టీబీజీకేఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు అయిలీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగులో అధ్యక్షుడు బీ. వెంకట్రావుతో కలిసి పాల్గొని మాట్లాడారు. అంతకుముందు వివిధ కార్మిక సంఘాల నుంచి టీబీజీకెఎస్లో చేరిన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. పాలకుర్తిలోని బసంత్నగర్లో నిర్వహించిన ప్రచార సభకు హాజరయ్యారు. ఆయాచోట్ల ఆయన మాట్లాడారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. పరాయి పాలనలో గోసపడ్డ సింగరేణి బిడ్డలకు సీఎం కేసీఆర్ న్యాయం చేశారని చెప్పారు. అసెంబ్లీలో ఐటీ మిహాయించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. కానీ బీజేపీ సర్కారు పట్టించుకోలేదని మండిపడ్డారు.
వారసత్వ ఉద్యోగాలను పొగొట్టిన పాపం కాంగ్రెస్దేనని నిప్పులు చెరిగారు. స్వయంపాలనలో తెలంగాణ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించి వెలుగులు నింపిందని కొనియాడారు. పనిచేసిందేవరో, వంచించిదెవరో కా ర్మికులు, ఈ ప్రాంత ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కలిసికట్టుగా కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ్డి, మాదాసు రాంమూర్తి, కార్పొరేటర్లు సాగంటి శంకర్, మందల కిషన్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు మేడి సదానందం, కొంగర రవీందర్, రవీందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నాగమణి, పాలకుర్తి వైస్ఎంపీపీ ఎర్రంస్వామి, సర్పంచ్ కట్టేకోల వేణుగోపాల్రావు, కోఆప్షన్ సర్వర్, ఏఎంసీ చైర్మన్ అల్లం రాజ య్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇంజపూరి నవీన్కుమార్, నాయకులు తంగెడ అనిల్రావు, ముల్కకొమురయ్య, దేవీ లక్ష్మీనర్సయ్య, గుళ్ల శ్యాం, గంధం ఆంజనేయులు, తోడేటి రవికుమా ర్, ముత్యం సంతోష్గౌడ్, తిరుపతిరెడ్డి, కాదాసు సంపత్, జట్పట్ రాజ్కుమార్, గద్వాల నరేశ్, ముత్యం లక్ష్మణ్, సమ్మయ్య, మేకలకుమార్, అసిఫ్, సూజాతా సత్తయ్య పాల్గొన్నారు.