రాజన్న సిరిసిల్ల డిసెంబర్ 31 : వస్త్ర ఉత్పత్తిపై కేంద్రం విధించిన 12 శాతం జీఎస్టీ పన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వస్త్ర ఉత్పత్తి దారులు నిరసన దీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్ ప్రారంభించారు.
వస్త్ర ఉత్పత్తుల పై ఉన్న 5 శాతాన్ని శాతం 12 శాతానికి పెంచడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జీఎస్టీ పెంచడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన జీఎస్టీ వల్ల పరిశ్రమ మూతపడే ప్రమాదం ఉన్నందున కేంద్రం వెంటనే జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.