కోనరావుపేట, ఫిబ్రవరి 21: రాజన్న సిరిసిల్ల జిల్ల కోనరావుపేట మండలం మరిమడ్లలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత వారం రోజులుగా వీదుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
ఈ క్రమంలోనే శనివారం నాడు గ్రామంలోని రెండు దూడలపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. పశువులతో పాటు మనుషులపై కూడా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.