రాజన్న సిరిసిల్ల : జనహిత కార్యక్రమంలో ప్రజలు అందించిన ఫిర్యాదుల పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన జనహిత (ప్రజావాణి) కార్యక్రమంలో అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించి మాట్లాడారు. జనహిత సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు.
పెండింగ్ అర్జీలపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిషన్ మోడ్ లో అన్నింటినీ పరిష్కరించాలని అన్నారు. జనహితలో భూ సమస్యల పరిష్కారం కోరుతూ ఎక్కువగా అర్జీలు వస్తున్నందున
రెవెన్యూ ఫిర్యాదులు, వినతుల పై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీఓ శ్రీనివాస్ రావు, ఏ ఓబీ గంగయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.